ఆంధ్రప్రదేశ్: అంత్యక్రియలకు తీసుకెళ్తుంటే పాడెపై నుంచి లేచి కూర్చున్నాడు - ప్రెస్ రివ్యూ

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (13:53 IST)
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఒక వ్యక్తిని అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా పాడెపైనుంచి లేచి కూర్చున్నట్టు ఈనాడు దినపత్రిక ఒక కథనం ప్రచురించింది. చనిపోయాడనుకొని అంత్యక్రియలకు తీసుకెళ్తున్న ఓ వ్యక్తి మార్గమధ్యంలో పాడెపై లేచి కూర్చున్న సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలంలో సోమవారం చోటుచేసుకుంది.

 
గ్రామస్థుల కథనం మేరకు.. మండలంలోని కట్టుబావి సమీపంలో చెట్టుకింద ఓ వ్యక్తి కొంతకాలంగా ఉంటున్నాడు. స్థానికులు పెట్టే భోజనం తిని జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజులుగా ఆ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటంతో చనిపోయినట్లు భావించి గ్రామ కార్యదర్శి మనోహర్‌, వీఆర్వో నాగరాజుకు స్థానికులు సమాచారం అందించారు.

 
చివరకు గ్రామస్థులంతా కలిసి అంత్యక్రియలకు ఏర్పాట్లుచేశారు. మృతదేహాన్ని తీసుకెళ్తుండగా ఆ వ్యక్తి ఒక్కసారిగా పాడెపై లేచి కూర్చున్నాడని పత్రిక చెప్పింది. అధికారులు వెంటనే 108కు సమాచారం అందించి బాధితుడిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.

 
ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతని బంధువులు ఎవరైనా ఉంటే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి రావాలని వైద్య సిబ్బంది కోరుతున్నారని ఈనాడు వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments