Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్: అంత్యక్రియలకు తీసుకెళ్తుంటే పాడెపై నుంచి లేచి కూర్చున్నాడు - ప్రెస్ రివ్యూ

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (13:53 IST)
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఒక వ్యక్తిని అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా పాడెపైనుంచి లేచి కూర్చున్నట్టు ఈనాడు దినపత్రిక ఒక కథనం ప్రచురించింది. చనిపోయాడనుకొని అంత్యక్రియలకు తీసుకెళ్తున్న ఓ వ్యక్తి మార్గమధ్యంలో పాడెపై లేచి కూర్చున్న సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలంలో సోమవారం చోటుచేసుకుంది.

 
గ్రామస్థుల కథనం మేరకు.. మండలంలోని కట్టుబావి సమీపంలో చెట్టుకింద ఓ వ్యక్తి కొంతకాలంగా ఉంటున్నాడు. స్థానికులు పెట్టే భోజనం తిని జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజులుగా ఆ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటంతో చనిపోయినట్లు భావించి గ్రామ కార్యదర్శి మనోహర్‌, వీఆర్వో నాగరాజుకు స్థానికులు సమాచారం అందించారు.

 
చివరకు గ్రామస్థులంతా కలిసి అంత్యక్రియలకు ఏర్పాట్లుచేశారు. మృతదేహాన్ని తీసుకెళ్తుండగా ఆ వ్యక్తి ఒక్కసారిగా పాడెపై లేచి కూర్చున్నాడని పత్రిక చెప్పింది. అధికారులు వెంటనే 108కు సమాచారం అందించి బాధితుడిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.

 
ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతని బంధువులు ఎవరైనా ఉంటే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి రావాలని వైద్య సిబ్బంది కోరుతున్నారని ఈనాడు వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments