Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ వేడినీటిలో పసుపు కలుపుకుని తాగితే..? చెడు కొలెస్ట్రాల్ పరార్..

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (20:24 IST)
రోజూ పరగడుపున వేడినీటిలో పసుపు కలుపుకుని టీలా తాగితే చెడు కొలెస్ట్రాల్ పరారవుతుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో చిటికెడు పసుపు కలుపుకుని ఉదయాన్నే పరగడుపునే తాగితే శరరీంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోతుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన కొవ్వు కరుగుతుంది. రక్తనాళాలు శుభ్రంగా మారుతాయి. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. 
 
పసుపును నిత్యం తీసుకోవడం వల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనబడే సమ్మేళనం అల్జీమర్స్ వ్యాధి లక్షణాలను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో ఉండే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. క్యాన్సర్లు రాకుండా నియంత్రించడంలో పసుపు అమోఘంగా పనిచేస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి పసుపుకు ఉంది. 
 
పసుపు నీటిని తీసుకోవడం వల్ల అధిక బరువు తగ్గుతారు. బ్లడ్ షుగర్ అదుపులోకి వస్తుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. చర్మాన్ని సంరక్షించే ఎన్నో గుణాలు పసుపులో ఉంటాయి. నిత్యం పసుపు కలిపిన గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగు పడుతుంది. చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు పోతాయి. గాయాలు, పుండ్లు త్వరగా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

14న ఏపీలో పిడుగులతో కూడిన వర్షమే వర్షం

పటాన‌చెరులో ప్రత్యక్షమైన పవన్ కళ్యాణ్!!

Supreme Court: కొమ్మినేనికి బెయిల్- సుప్రీం ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిది: జగన్

Ahmedabad: భర్తను కలిసేందుకు లండన్‌కు వెళ్ళిన ఖుష్భూ.. తండ్రితో దిగిన చివరి ఫోటో వైరల్

Kommineni: ఏపీ సర్కారుకు సుప్రీం చీవాట్లు.. కొమ్మినేనికి బెయిల్- విడుదల చేయండి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

తర్వాతి కథనం
Show comments