Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీ స్త్రీకి ఆ సమయంలో వచ్చే సమస్యలు...

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (21:54 IST)
గర్భధారణ  సమయంలో దగ్గు చాలా అసంతృప్తిని కలుగ చేస్తుంది, కానీ నిరంతరంగా కలిగే దగ్గు మరియు తీవ్రమైన దగ్గు గర్భాశయంలో ఉన్న శిశువుకు ఏ విధంగానూ హాని కలిగించదు. గర్భ సమయంలో కలిగే దగ్గు నివారణకు అల్లోపతి మందుల కన్నా, ఇంట్లో ఉండే ఔషధాలు చాలావరకు శ్రేయస్కరం అని చెప్పవచ్చు. గర్భ ధరించిన సమయంలో కలిగే దగ్గును శక్తివంతంగా తగ్గించే ఔషదాలు ఏమిటో చూద్దాం.
 
1. తులసి ఆకులు మరియు తేనెలతో కలిపి తయారు చేసిన ఒక చెంచా మిశ్రమం దగ్గును కలిగించే కారకాలను తొలగిస్తుంది. ఇందులో తులసి ఆకులను నీటిలో కలిపి వేడి చేసి, దీనికి కొన్ని చుక్కల తేనెని కలపండి. ఇందులోని తులసి ఆకులు దగ్గును తగ్గిస్తాయి మరియు తేనె గొంతులో కలిగిన గాయాలనూ తగ్గిస్తుంది.
 
2. ఉప్పు మరియు నల్ల మిరియాలతో నిమ్మకాయను పీల్చటం వలన దగ్గు తీవ్రతలు తగ్గు ముఖం పట్టే అవకాశం ఉంది.
 
3. క్రమంగా రెండు రోజుల పాటు ద్రాక్ష పండ్లను తినటం వలన కూడా దగ్గు తీవ్రతలు తగ్గుతాయి. కారణం- ద్రాక్ష పండ్లు ఎక్స్పెక్టోరెంట్స్ గుణాలను కలిగి ఉండటం వలన గొంతు మరియు ఊపిరితిత్తులను సవరించేస్తుంది.
 
4. వారానికి తినే భోజనంలో రెండు నుండి మూడు సార్లు వెల్లుల్లిని తినటం వలన కూడా దగ్గు నుండి త్వరగా ఉపశమనం పొందుతారు.
 
5. పొడి దగ్గు కలిగి ఉన్నవారు అనగా శ్లేష్మంతో కూడిన దగ్గు కానటువంటి రకం కలిగి ఉన్నట్లయితే, పడుకోటానికి ముందుగా 3 లేదా 4 చెంచాల తాజా కొబ్బరి పాలను, మరియు ఒక చెంచా తేనె కలిపిన మిశ్రమాన్ని తీసుకోండి. ఈ మిశ్రమం వలన పొడి దగ్గు నుండి త్వరగా ఉపశమనం పొందుతారు. ఉల్లి రసం మరియు తేనెలను కలిపి తయారుచేసిన మిశ్రమం దగ్గుకు టానిక్'గా పని చేస్తుంది.
 
6. బాగా నానబెట్టిన బాదం గింజలు (పైన పొర లేనివి) మరియు చక్కెర కలిపిన మిశ్రమం దగ్గుకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
 
7. నీలగిరి (యూకలిఫ్టస్) ఆకులు లేదా పుదీనతో తయారుచేసిన సూప్‌లను తాగటం వలన గొంతులో చికాకులను కలిగించే కారకాలను తొలగించి గొంతు నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments