Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనిలో పడి నీళ్లు తాగడం మరిచిపోతున్నారా?

Webdunia
శుక్రవారం, 12 డిశెంబరు 2014 (16:22 IST)
పనిలో పడి నీళ్లు తాగడం మరిచిపోతున్నారా? అయితే జాగ్రత్త పడండి. లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా నీళ్లు తాగకపోతే దానివల్ల తలనొప్పులు, అలసట, శరీరంలో శక్తిలేకపోవడం వంటి రుగ్మతలు తప్పవు. అందుకే కాస్త దాహంగా అనిపించినా ఎంత పనిలో ఉన్నా సరే పక్కన పెట్టేసి వెంటనే కనీసం రెండు గ్లాసుల నీళ్లు తాగండి. అప్పుడప్పుడు కాస్త నీటిని తాగడం ద్వారా బరువు కూడా తగ్గవచ్చుననే విషయం గుర్తుంచుకోండి. 
 
ఆదివారం వచ్చిందంటే.. చాలా మంది మహిళలు పనుల్లో మునిగిపోతుంటారు. అలా చేయకుండా కాసేపు అలా నడుం వాల్చండి. లేకుంటే వర్కింగ్ వుమెన్‌కు కష్టమే. వారానికి ఓ సారైనా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటేనే అది రీఛార్జిలా పనిచేస్తుంది.
 
రోజంతా చురుగ్గా పనులు చక్కబెట్టాలంటే వ్యాయామాన్ని మించిన పరిష్కారం లేదని, తల్లులకు ఇది చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వ్యాయామం చేసేందుకు టైమ్ లేకపోతే ఇంటి పనుల్లో భాగంగానే మెట్లెక్కి దిగండి. 
 
పిల్లల కోసం రుచికరమైన పదార్థాలూ, టిఫిన్లూ చేయడం, ఆనందించడం ఒక్కటే కాదు.. ఎంత హడావుడిగా ఉన్నా.. రోజూ పొద్దున్నే టిఫిన్ మాత్రం మానేయకండి. రోజంతా చురుగ్గా ఉండేందుకు ఇది ఒక చక్కని పరిష్కారం. అలాగే వేళకు భోజనం చేయాల్సింది కూడా చాలా ముఖ్యమే. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments