నేరేడు పండును తింటున్నారా? ఐతే గింజల్ని పారేయకండి..

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (12:08 IST)
నేరేడు పండ్లను తింటున్నారా? ఐతే గింజల్ని పారేయకండి అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. నేరేడు పండు గింజలు మధుమేహాన్ని నియంత్రించే శక్తిని కలిగివుంటాయని.. ఆ గింజల్ని ఎండబెట్టి పొడి చేసుకుని ఉపయోగించుకుంటే మధుమేహం ఆమడ దూరంలో నిలిచిపోతుందని వారు సూచిస్తున్నారు. 


నేరేడు ఆకులు లేదా గింజల్ని ఎండబెట్టి.. పొడి చేసి రోజూ ఓ టీ స్పూన్ మేర తేనెతో కలిపి తీసుకుంటే మధుమేహంతో ఇబ్బందిపడే వారికే కాదు.. అందరికీ మేలు జరుగుతుంది. 
 
పొడిని నీళ్లలో వేసి మరిగించి కషాయం రూపంలో సేవిస్తే మధుమేహులకి మరీ మంచిది. ముఖ్యంగా గింజల్లోని గ్లైకోసైడ్‌ పిండిపదార్థాల్ని చక్కెరలుగా మారకుండా అడ్డుకుంటుంది. పైగా క్లోమగ్రంథుల నుంచి ఇన్సులిన్‌ స్రావాన్ని పెంచే గుణాలూ ఈ గింజల్లో ఉన్నాయి. ఈ పొడి అతి దాహాన్నీ తగ్గిస్తుంది.


కాబట్టి నేరేడు పండ్లు తిని గింజల్ని పారేయకండి. ఎండబెట్టి పొడి చేసి వాడుకుంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు 
 
ఇక నేరేడు పండు మంచి మౌత్‌ ఫ్రెష్‌నర్‌‌గా పనిచేస్తుంది. చిగుళ్ల వ్యాధులను నివారిస్తుంది. ఇందులో వుండే ఆమ్లాలు జీర్ణక్రియకు తోడ్పడటం ద్వారా కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తమిళనాడులో విజయ్‌ గెలుపు.. సంబరాలు చేసుకుంటున్న జగన్ ఫ్యాన్స్.. ఎందుకు?

యువతిని చంపేసి చెత్తకుప్పలో పడేసారు, ఏం జరిగింది?

విజయ్‌కి అన్నామలై కితాబు.. కన్నీళ్లు పెట్టుకున్న బీజేపీ నేత ఎందుకు? (video)

తమిళనాడు ఎన్నికల్లో ఆటో డ్రైవర్ చేతిలో మాజీ మంత్రికి డిపాజిట్ గల్లంతు

ఎన్టీఆర్ తర్వాత దళపతి విజయ్.. భీమవరంలో బెట్టింగ్‌లు.. భారీ డబ్బు గోవిందా!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi and Pawan Kalyan: టీవీకే విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్

PawanKalyan: వాదోపవాదాలకు దారితీసిన పవన్ కళ్యాణ్ బంగారం 20వ వార్షికోత్సవం

Joe Sharma: M4M మూవీలో కిల్లర్ ఎవరో చెప్పిన వారికి లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్

రీల్స్ తో ట్రెండ్ అవుతున్న విజయ్ దేవరకొండ రణబాలి నుంచి ఏందయ్య సామీ.. సాంగ్

Dalapati Vijay : దళపతి విజయ్ కు టాలీవుడ్ యూత్ హీరోలు ప్రశసంలు -త్రిషకు శుభాకాంక్షలు

తర్వాతి కథనం
Show comments