తలనొప్పి ఎక్కువగా ఉంటే టాబ్లెట్ వద్దు.. ఆ టీ ఒక గ్లాస్..

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (20:56 IST)
చాలామంది ఒత్తిడికి లోనై ప్రతిరోజు తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. తలనొప్పి తగ్గేందుకు ఇష్టమొచ్చినట్లు టాబ్లెట్లు వాడేస్తుంటారు. అది సైడ్ ఎఫెక్ట్‌గా మారుతుందన్న విషయాన్ని పక్కనబెట్టేస్తారు. కానీ ఆయుర్వేదంలో మాత్రం తలనొప్పికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఒక టీ తాగితే సరిపోతుందన్నారు ఆయుర్వేద నిపుణులు. అదేమిటంటే.. పుదీనా టీ. 
 
మన ఇంటిలోని వస్తువులతోనే ఈ టీను తయారుచేసుకుని తాగితే తలనొప్పి మొత్తం ఎగిరిపోతుంది. పుదీనా టీను తయారుచేసుకోవడం చాలా ఈజీ. పుదీనా ఆకులు గుప్పెడు, గ్రీన్ టీ బ్యాగులు, రెండు చెంచాలు తేనె, నీళ్ళు రెండు కప్పులు, పుదీనా ఆకులని నీళ్ళలో వేసుకుని మంచి పరిమళం వ్యాపించే వరకూ నీటిని తక్కువ మంటపైన మరిగించుకోవాలి. ఆపైన గ్రీన్ టీ బ్యాగులు లేదా పొడి చేసి వడకట్టుకుని తేనె, నిమ్మరసంతో కలిపి సర్వ్ చేసుకుంటూ రుచిగా ఉంటుంది. 
 
జలుబుని తగ్గించడంతో పాటు అజీర్తి సమస్యని అదుపులో ఉంచుతుంది పుదీనా టీ. అంతే కాదు తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు పుదీనా టీ తాగితే ఉపశమనం కలుగుతుంది. నెలసరి ఇబ్బందులు వేధిస్తున్నప్పుడు పుదీనా టీ చక్కని ఉపశమనం ఇస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాపై జరుగుతున్న విషప్రచారంపై కోర్టు గ్యాగ్ ఆర్డర్, తక్షణమే ఆ కంటెంట్ తొలగించాలి: బీఆర్ నాయుడు

టెహ్రాన్‌పై బాంబుల వర్షం - సురక్షిత ప్రాంతాలకు భారతీయ విద్యార్థుల తరలింపు

ఇరాన్ అధ్యక్ష భవన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

ప్రాజెక్ట్ షైన్ కింద పెద్దపల్లికి హెచ్‌సిసిబి చేయూత

కిలో టమోటా రూ. 4, కానీ మార్కెట్లో రూ. 15, ఏం చేద్దాం?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అప్పట్లో ఎకరం 9 లక్షలకు అమ్మా, ఇప్పుడక్కడ ఎకరం 100 కోట్లు, ఏం చేస్తాం?: నటుడు శివాజీ

Chiranjeevi: పెద్ది చిత్రం రైరై రారా పాట లో చరణ్ కష్టానికి ఫలితం దక్కింది : మెగాస్టార్ చిరంజీవి

Laya: మా అమ్మాయి ఓటీటీలో సినిమా అనగానే ఎంతో బాధపడింది : లయ

Pooja : దోశ డైరీస్ పై మంచి కథలన్నీ నిర్మించాలని ఉంది.: పూజా శరత్ కుమార్

Manoj: డేవిడ్ రెడ్డి షూటింగ్‌తో మనోజ్ బిజీ - సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న మౌనిక

తర్వాతి కథనం
Show comments