Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

సెల్వి
గురువారం, 6 మార్చి 2025 (09:26 IST)
సాధారణంగా ప్రతి మహిళ తన ముఖం చాలా అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీనికోసం తరచుగా బ్యూటీ పార్లర్లకు వెళ్తుంటారు. ఇంకా మరికొందరు ఖరీదైన క్రీములను కొని ముఖాలకు రాసుకుంటారు. 
 
అయితే వీటితో డబ్బు వృధా. మెరిసే అందం కోసం మందార పువ్వుతో పొందవచ్చు. ఎలాగో చూద్దాం.. మందార పువ్వు, దాని ఆకులను సాధారణంగా జుట్టును మృదువుగా, ఆరోగ్యంగా మార్చడానికి ఉపయోగిస్తారు. ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడానికి మందార పువ్వులను ఉపయోగించవచ్చు. 
 
మందార పువ్వులతో తయారు చేసిన ఈ ఫేస్ ప్యాక్ కేవలం ఒక వారంలోనే ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. తాజాగా కోసిన 10 మందార పువ్వులను తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో అర లీటరు నీరు పోసి మరిగించాలి. నీరు వేడెక్కిన తర్వాత, దానికి మందార పువ్వును వేయాలి. 
 
మందార పువ్వు జెల్ రూపం మారిన తర్వాత.. ఆ జెల్‌తో సున్నితంగా మసాజ్ చేయండి. ముఖానికి మాత్రమే కాకుండా, మీ చేతులు, కాళ్ళు, మెడకు కూడా అప్లై చేయవచ్చు. 
 
20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై మీ ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖంలోని మురికి, మచ్చలు, నల్లటి మచ్చలు తొలగిపోయి, ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. స్నానానికి ముందు ఏడు రోజులు ఇలా చేస్తే, ముఖం ఏడు రోజుల్లో కాంతివంతంగా మారుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

తర్వాతి కథనం
Show comments