Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ రెండుసార్లు మజ్జిగ తాగండి.. బరువు తగ్గండి!

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2015 (14:22 IST)
లావుగా ఉండటం తప్పుకాదు. కాని తగ్గటం చాలా అవసరం. అందుకని ఉపవాసం ఉండకూడదు. కానీ ఒళ్ళు పెంచే ఆహారం తినకూడదని తెలుసుకోవాలి. శరీరపు బరువు సమతుల్యమై.. శరీరాకృతి పాడవకుండా ఉండాలంటే.. ఆత్మస్థైర్యం ఉండాలి. ఇంకా శరీరపు బరువును పెంచే నెయ్యి, తీపి పదార్థాలు, పెరుగు, మాంసం, వేపుడు కూరలు, నూనె వస్తువులు ముఖ్యంగా వేరుశెనగ నూనె, దుంపకూరలు, మినుముతో చేసే పదార్థాలు తినకండి. మజ్జిగ ఒళ్ళును పెరగనివ్వదు. రోజూ రెండుసార్లు మజ్జిగ తాగండి. 
 
అన్నం తినేముందు కనీసం నాలుగు గంటలు రాగి చెంబులో నిల్వ ఉంచిన నీటిని కొంచెం తాగండి. రోజూ పరగడుపున అరగ్లాసు గోరు వెచ్చని నీళ్ళలో చెమ్చాన్నర తేనె కలుపుకుని తాగండి. మధ్యాహ్నం నిద్రపోకండి. రాత్రి అన్నం తిన్నాక కనీసం వంద అడుగులు నడిచి అప్పుడు పడుకోండి.
 
ఇంకా అర గంట సేపు నడవటం, సూర్య నమస్కారాలు చేయడం మంచిది. ఇంకా మిరియాలు, అల్లం, పిప్పలి, ఉసిరికాయ, నిమ్మకాయ, జీలకర్ర, ధనియాలు, వాము.. వీటిని ఆహారంలో చేర్చుకోవాలి. చారు, కూర, పుదీనా చట్నీలో వీటిని చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments