Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో శొంఠి చేసే మేలు

శొంఠిని నేతితో వేయించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మొదటి ముద్ద అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి, గ్యాస్ సంబంధిత సమస్యలు, పొట్టలో వికారం వంటివి అన్నీ తొలగిపోతాయి. శొంఠి

Webdunia
శనివారం, 11 నవంబరు 2017 (11:14 IST)
శొంఠిని నేతితో వేయించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మొదటి ముద్ద అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి, గ్యాస్ సంబంధిత సమస్యలు, పొట్టలో వికారం వంటివి అన్నీ తొలగిపోతాయి. శొంఠి ఆకలిని పెంచుతుంది. జీర్ణ రసాలు ఊరడాన్ని ప్రేరేపిస్తుంది. అల్లం తాగడం ద్వారా అజీర్తి తగ్గుతుంది. అల్లం తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్‌కు చెక్ పెడుతుంది. కండరాల నొప్పుల్ని తగ్గిస్తుంది. 
 
గర్భిణీల్లో తలతిరగడం, వికారం, వేవిళ్లు ఎక్కువగా ఉంటాయి. అల్లం తినడము వలన బాగా ఉపశమనం కలుగుతుంది. వర్షాకాలం జలుబూ, దగ్గు వంటి సమస్యలు ఎదురవుతాయి. జలుబు చేసినప్పుడు శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం కలుగుతుంది. అలాగే మరుగుతున్న టీ లేదా కాఫీలో కూడా ఈ పొడిని కొద్దిగా కలిపినా ప్రయోజనం ఉంటుంది. 
 
జలుబు తీవ్రత ఎక్కువగా ఉంటే శొంఠి పొడికి చిటికెడు బెల్లం ముక్క కలిపి రోజూ రెండు మూడు సార్లు తినాలి. అలాగే చెంచా శొంఠి పొడికి చిటికెడు లవంగాల పొడి, ఉప్పు ఒకటిన్నర కప్పు నీటిలో వేసి మరగనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే జలుబును నివారించవచ్చు. 
 
వేడి అన్నంలో శొంఠి పొడిని, పప్పునూనెను కలిపి ప్రతీ రోజూ మొదటి ముద్దగా తింటే అజీర్తి పోయి ఆకలి పెరుగుతుంది. అలాగే పరగడుపున నీళ్లల్లో శొంఠి పొడి కలిపి మరగించి, అరచెంచా తేనె కలిపి తాగితే కొలెస్ట్రాల్‌ తగ్గడమే కాదు, బరువూ అదుపులో ఉంటుంది. ఈ పొడిని వేడి పాలల్లో వేసుకుని, చిటికెడు చక్కెర కూడా కలిపి తాగితే మూత్రాశయానికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments