Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైరస్‌కు చెక్ పెట్టే.. కరివేపాకు కషాయం.. ఎలా చేయాలంటే? (video)

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (10:55 IST)
కరివేపాకు పొడి వంద గ్రాములు, 25 గ్రాముల శొంఠి  పొడి, కరక్కాయ పొడి 50 గ్రాములు తీసుకుని కలుపుకుని ఓ సీసాలో భద్రపరుచుకోవాలి. రోజూ అరస్పూన్ మేర ఈ పొడిని గ్లాసుడు వేడినీటిలో మరిగించి రోజూ రెండుపూటలా తీసుకుంటే.. రక్తశుద్ధికి ఉపకరిస్తుంది. శరీరానికి ఉత్తేజాన్నిస్తుంది. 
 
అజీర్తిని దూరం చేసుకోవాలంటే.. వాత, పిత్త, కఫానికి సంబంధించిన రోగాలకు చెక్ పెట్టాలంటే.. కరివేపాకును తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. కరివేపాకును నేతిలో వేయించి అందులో రెండు మిరపకాయలు, చింతపండు నిమ్మ పండంత, ఉప్పు చేర్చి పచ్చడిలా తయారు చేసుకుంటే శరీరంలో రక్త ప్రసరణ మెరుగు అవుతుంది. వేవిళ్లు, అజీర్తిని ఇది నయం చేస్తుంది. కరివేపాకు పొడి, గోరింటాకును బాగా పేస్టులా రుబ్బుకుని తలకు పట్టిస్తే జుట్టు నెరవదు. 
 
కరివేపాకు, శొంఠి, జీలకర్ర, ఉల్లి వంటి వాటిని సమపాళ్లలో తీసుకుని దోరగా వేయించి పొడి కొట్టుకుని, ఆ పొడిని రోజూ నేతితో వేడి అన్నంలో కలుపుకుని తింటే మలబద్ధకం వుండదు. కరివేపాకు పొడిని రోజూ రెండు స్పూన్ల మేర తీసుకుంటే దగ్గు, జలుబు మటాష్ అవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే మునగకాడలు, కరివేపాకు కాడలు, ఉసిరి కాడలు తలా ఒక్కో గుప్పెడు తీసుకుని, శొంఠి, మిరియాలు, జీలకర్ర 20 గ్రాముల మేర తీసుకుని.. వీటిని పొడి చేసుకుని కషాయంలా తీసుకుంటే.. వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు.. వైరస్, బ్యాక్టీరియాకు సంబంధించిన రోగాలను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సెలవిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నీకెన్నిసార్లు చెప్పాలి... నన్ను కలవడానికి ఢిల్లీకి రావాలని? లోకేశ్‌కు ప్రధాని ప్రశ్న!

Hyderabad: నెలవారీ బస్ పాస్ హోల్డర్ల కోసం మెట్రో కాంబో టికెన్

పాకిస్థాన్‌కు మరో షాకిచ్చిన కేంద్రం... దిగుమతులపై నిషేధం!

Class 11 Exam: పొలంలో తొమ్మిది మందిచే అత్యాచారం.. 11వ తరగతి పరీక్షలకు బాధితురాలు

16 యేళ్ల మైనర్ బాలుడుపై 28 యేళ్ళ మహిళ అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

వేవ్స్ సమ్మిట్ 2025 కు ఆహ్వానం గౌరవంగా భావిస్తున్నా : జో శర్మ

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

తర్వాతి కథనం
Show comments