వానాకాలం, శీతాకాలం.. ఫుడ్ పాయిజనింగ్కు చెక్ పెట్టాలా.. ధనియాల పొడి దివ్యౌషధంగా పనిచేస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ధనియాలను యాంటిబయాటిక్గా చెప్పుకుంటుంటారు. ఇవి ఫుడ్పాయిజనింగ్ను అరికట్టడంలో బాగా ఉపకరిస్తాయని ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో తేలాయి.
ధనియాల నుంచి తీసిన నూనె ఫుడ్పాయిజనింగ్కు కారణమయ్యే "ఎమ్ఆర్ఎస్ఏ" లాంటి విషపూరిత బ్యాక్టీరియాలతో సమర్థవంతంగా పోరాడుతుందని పరిశోధన ద్వారా తెలుస్తోంది.
కేవలం 1.6 శాతం ధనియాల నూనెతో 12 రకాల విషపూరిత బ్యాక్టీరియాల అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తుందని, ఈ నూనె ఎమ్ఆర్ఎస్ఏతో పాటు సాల్మొనెల్లా, ఈ కొలీలాంటి కణాల బాహ్య చర్మంపై దాడి చేసి, వాటి శ్వాసక్రియ వ్యవస్థను దెబ్బతీయడం వల్ల ఇది సాధ్యమవుతోందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ డోమింగీస్ వెల్లడించారు. అందుకే ఇపుడు ధనియాలను ఉపయోగించి ఫుడ్పాయిజనింగ్ను అరికట్టే లోషన్స్ మాత్రలు తయారు చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు.