ఇవి తీసుకుంటే పంటి నొప్పి సమస్య మాయం

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (22:45 IST)
కాఫీలు, టీలు, శీతల పానీయాలు... ఇలా చెప్పుకుంటూ పోతే అతివేడి, అతిచల్లని పానీయాలను తీసుకోవడం వల్ల దంతాలకు సమస్య ఏర్పడుతుంది. అలాగే రాత్రిపూట భోజనం అయ్యాక చాలామంది దంతాలను శుభ్రపరచుకోవడం చేయరు. దీనితో దంత సమస్యలు ఉత్పన్నమవుతాయి. కొందరికి చిగుళ్లు బలహీనంగా వుండటం మూలంగా దంత సమస్యలు వస్తుంటాయి. వీటిని అధిగమించేందుకు ఆయుర్వేదంలో చిట్కాలు వున్నాయి. అవేంటో చూద్దాం.
 
చెట్టు మీదే ఎండిన రామ్ములకాయల్ని సంగ్రహించి, వాటి విత్తనాలను భద్రపరచుకోవాలి. పిప్పి పళ్లతో విపరీతంగా బాధపడేవారికి ఇలా చేయాలి. నిప్పులపై మైలతుత్తం పొడిని ములక్కాయ విత్తనాలను కలిపి వేస్తే ఘాటైన పొగ వస్తుంది. కళ్లు మూసుకొని ఆ పొగను నోటిలోకి పీల్చి బందిస్తే వెంటనే పంటి రంధ్రం లోంచి క్రిములు రాలి పడతాయి. దీనితో నొప్పినుంచి ఉపశమనం కలుగుతుంది.
 
పిడికెడు ఉత్తరేణి ముదురాకులు తీసుకొని రసం తీసి, కొంచెం సారా కలిపి పంటి నొప్పి ఏ వైపున ఉంటే ఆ వైపు చెవిలో వేసుకొని ఎండలో 10 నిమిషాలు పడుకుంటే పుచ్చిన దంతంలోని క్రిములు చెవిలోంచి బయటకు వస్తాయి.
 
అరస్పూన్ లవంగాలు, కొద్దిగా కొబ్బరినూనె, టీస్పూన్ మిరియాలపొడి, చిటికెడు ఉప్పు వీటిని అన్నింటిని కలిపి పుచ్చిన పంటిపై రాస్తే చిటికెలో నొప్పి మాయం అవుతుంది.
 
వెల్లుల్లిలో యాంటీబయోటిక్ ప్రోపర్టీస్ ఉంటాయి. 3 వెల్లుల్లి రెబ్బలను మెత్తగా చేసి దానికి చిటికెడు ఉప్పును కలిపి పుచ్చి పంటిపై పెడితే తక్షణం ఉపశమనం కలుగుతుంది.
 
జామ ఆకులలో యాంటీ ఇన్ప్లోమెంట్రీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రోపర్టీస్ ఉంటాయి. పంటి నొప్పితో బాధపడేవారు 2 లేక 3 జామ ఆకుల్ని శుభ్రంగా కడిగి తినటం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏంటయ్యా ఇది..? పాఠశాల బాత్రూంలో సిగిరెట్లు తాగుతున్నాడని మందలిస్తే మాస్టారిపై దాడి

నారా దేవాన్ష్ ఈ తరం పిల్లలలాగా టెలివిజన్, ఫోన్లలో లేడు.. నారా లోకేష్

యుద్ధంలో ఇరాన్ ఓడితే తర్వాత టార్గెట్ మేమే: పాకిస్తాన్ రక్షణ మంత్రి

ఎంకె స్టాలిన్‌తో జగన్ సంబంధాలు.. బీజేపీని ఎదిరించే ధైర్యం ఆయనకుందా?

వరుసకు చెల్లితో ప్రేమాయణం.. పురుగుల మందు తాగింది.. చివరికి ఏమైంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: మార్చి నెల ఉస్తాద్ గబ్బర్ సింగ్‌కు కలిసి వచ్చేలా వుంది

Sathya: నాగ చైతన్య చిత్రం వృషకర్మ లో సత్య లుక్‌

Srinath: మెన్షన్ హౌస్ మల్లేష్ నిజాయితీగా తీసిన సినిమా: శ్రీనాథ్ మాగంటి

Anantha Sriram: యూత్ కి ఒక యాంథమ్ లాగా ఉండాలనే రై రై రారా. పాట రాశాం : అనంత శ్రీరామ్

Bandla Ganesh: ఓటీటీ వద్దని సాయి, నితిన్‌కు ఫోన్‌ చేసి థియేటర్‌లో చేయమని చెప్పా : బండ్ల గణేష్‌

తర్వాతి కథనం
Show comments