Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతో అరటి పండు చేర్చితే..?

Webdunia
బుధవారం, 7 నవంబరు 2018 (15:03 IST)
ఈ రోజుల్లో అందరు ఏవంటే అవి తినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే.. ఈ కాలంలో వచ్చే అనారోగ్యాల సమస్యలను తొలగించడానికి.. మరి అనారోగ్యాలకు చెక్ పెట్టే కొన్ని చిట్కాలను తెలుసుకుందాం..
 
పెరుగు చలికాలంలో అంత మంచిగా కాదని కొందరి మాట. కానీ, పెరుగులోని ఆరోగ్య ప్రయోజనాలు వేరే పదార్థాలలో దొరకవు. కాబట్టి పెరుగులో కొద్దిగా కొబ్బరి పాలు చేర్చి అందులో అరటిపండు ముక్కలు, తేనె వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో గంటపాటు అలానే ఉంచాలి. కాసేపటి తరువాత ద్రాక్ష పండ్లు వేసి సేవిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
బంగాళాదుంప చిప్స్ అంటే నచ్చని వారు ఎవ్వరు ఉండరు. కానీ, ఈ చిప్స్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్తున్నారు. వీటికి బదులుగా చిలగడ దుంపల చిప్స్ తీసుకోవచ్చును. దుంపలను స్లైసుల్లా కట్ చేసి ఓవెన్‌లో వేయించాలి. వాటిపై కొద్దిగా ఉప్పు, కారం, మిరియాల పొడి చల్లి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 
 
శీతలపానీయాలకు బదులు తాజా పండ్ల రసాలు తీసుకుంటే మంచిది. ఎందుకంటే.. ఈ చలికాలంలో శీతలపానీయాలు తీసుకుంటే జలుబు, దగ్గు, జ్వరాలు వచ్చే అవకాశాలున్నాయి. కనుక పండ్ల రసాలు సేవిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. ఓ సీసాలో కొన్ని నీళ్లుపోసి అందులో కొద్దిగా తులసి, పుదీనా, నిమ్మచెక్క, కీరా ముక్క వేసి బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రివేళల్లో తీసుకుంటే శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి.   

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments