Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (13:02 IST)
అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం భూమి పూజ చేస్తున్నారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి మొదటి ఇటుకను ఆయన వేయనున్నారు.
 
బుధవారం అయోధ్యలో జరిగే రామ మందిరం భూమిపూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అథితిగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలోని ఫొటోగ్రాఫర్ మహేంద్ర త్రిపాఠి పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. 
29 యేళ్ల క్రితం అంటే 1991లో రామ్‌లల్లా జన్మోత్సవ కార్యక్రమం సందర్భంగా బీజేపీ సీనియర్‌ నేత మురళీమనోహర్‌ జోషితో కలిసి మోడీ అయోధ్యలో పర్యటించారని ఆయన గుర్తుచేశారు. తాను ఆ సమయంలో వీహెచ్‌పీ కోసం ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తుండేవాడినని, అక్కడ కొంతమంది జర్నలిస్టులు కూడా తనతో ఉన్నారన్నారు.
మోడీని బీజేపీ గుజరాత్‌ నాయకుడిగా విలేకరులకు మురళీ మనోహర్ జోషి పరిచయం చేశారని చెప్పారు. తనతో పాటు మరికొంత మంది జర్నలిస్టులు మోడీని అయోధ్యకు తిరిగి ఎప్పుడు వస్తారని అడిగారని చెప్పాడు. 
దీనిపై మోడీ స్పందిస్తూ, రామ్ మందిర నిర్మాణం ప్రారంభమైనప్పుడే తిరిగి తాను అయోధ్యకు వస్తానని చెప్పారని వివరించారు. అప్పట్లో మోడీ తాను ఇచ్చిన మాట ఇప్పుడు నిలబెట్టుకున్నారని ఆయన అన్నాడు.

 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments