అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (13:02 IST)
అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం భూమి పూజ చేస్తున్నారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి మొదటి ఇటుకను ఆయన వేయనున్నారు.
 
బుధవారం అయోధ్యలో జరిగే రామ మందిరం భూమిపూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అథితిగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలోని ఫొటోగ్రాఫర్ మహేంద్ర త్రిపాఠి పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. 
29 యేళ్ల క్రితం అంటే 1991లో రామ్‌లల్లా జన్మోత్సవ కార్యక్రమం సందర్భంగా బీజేపీ సీనియర్‌ నేత మురళీమనోహర్‌ జోషితో కలిసి మోడీ అయోధ్యలో పర్యటించారని ఆయన గుర్తుచేశారు. తాను ఆ సమయంలో వీహెచ్‌పీ కోసం ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తుండేవాడినని, అక్కడ కొంతమంది జర్నలిస్టులు కూడా తనతో ఉన్నారన్నారు.
మోడీని బీజేపీ గుజరాత్‌ నాయకుడిగా విలేకరులకు మురళీ మనోహర్ జోషి పరిచయం చేశారని చెప్పారు. తనతో పాటు మరికొంత మంది జర్నలిస్టులు మోడీని అయోధ్యకు తిరిగి ఎప్పుడు వస్తారని అడిగారని చెప్పాడు. 
దీనిపై మోడీ స్పందిస్తూ, రామ్ మందిర నిర్మాణం ప్రారంభమైనప్పుడే తిరిగి తాను అయోధ్యకు వస్తానని చెప్పారని వివరించారు. అప్పట్లో మోడీ తాను ఇచ్చిన మాట ఇప్పుడు నిలబెట్టుకున్నారని ఆయన అన్నాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments