Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా పార్లమెంటేరియన్లదే పై చేయి

Webdunia
ప్రపంచ వ్యాప్తంగా పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతున్న మహిళల సంఖ్య ఈ సంవత్సరం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయితే జాతీయ స్థాయి చట్టసభల్లో పురుషులతో సమానమైన వాటాను పొందడంలో మహిళ పార్లమెంటేరియన్ల సంఖ్య గణనీయమైన స్థాయిలో లేదని ఇటీవల విడుదల చేసిన తన వార్షిక నివేదికలో అంతర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) పేర్కొంది. ప్రస్తుతం పార్లమెంట్‌లలో మహిళా సభ్యుల సంఖ్య 17.7 శాతానికి చేరుకుందని ఐపీయూ ప్రధాన కార్యదర్శి ఆండర్స్ జాన్సన్ శనివారం మీడియాతో అన్నారు. 2005 సంవత్సరం ముగిసేనాటికి ఈ శాతం 16.3 కాగా డిసెంబర్ 2004 నాటికి 15.7 శాతంగా నమోదైందని వెల్లడించారు.

" ఇది పురోగతిగా పేర్కొనవచ్చు. కానీ మరింత లోతుగా అధ్యయనం చేసినట్లయితే పురోగతి మందకొడిగా సాగుతోందని" జాన్సన్ అన్నారు. అయితే పార్లమెంట్‌లో లింగ సమానత్వం సాధించడమనది బహుదూరంలో గల గమ్యస్థానమని, సమీప భవిష్యత్తులో సాధ్యం కానిదిగా జాన్సన్ తేల్చి చెప్పారు. "ప్రస్తుత శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే 2050 సంవత్సరం కంటే ముందుగా పార్లమెంట్‌లో లింగ సమానత్వాన్ని సాధించలేమని" జోస్యం చెప్పారు. పార్లమెంట్లలో మహిళల సంఖ్య హీనపక్షం 30 శాతంగా ఉండాలని 1995 సంవత్సరం బీజింగ్‌లో జరిగిన యూఎన్ మహిళా సదస్సు లక్ష్యాన్ని నిర్దేశించింది.

అయితే ఐపీయూ అందించిన సమాచారాన్ని అనుసరించి 2005 సంవత్సరాంతానికి కేవలం 20 దేశాల్లోని దిగువ సభల్లో మాత్రమే మహిళల సంఖ్య 30 శాతానికి చేరుకుందని తెలియవచ్చింది. అందులో నాలుగు దేశాలు 40 శాతాన్ని అధిగమించాయి. అత్యధిక శాతం మహిళా సభ్యులు కలిగిన దేశంగా 48.8 శాతంతో రువాండా మొదట స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాన్ని వరుసగా 47 శాతం, 41.5 శాతం మరియు 40 శాతంతో స్వీడన్, ఫిన్లాండ్ మరియు అర్జెంటీనా దేశాలు కైవసం చేసుకున్నాయని ఐపీయూ తన వార్షిక నివేదికలో పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అర్థభాగాన్ని ఆక్రమించుకున్న కోస్టారికా, క్యూబా, మొజాంబిక్, దక్షిణాఫ్రికా, ఉగాండా, బురుండీ మరియు టాంజానీయా దేశాలు తమ పార్లమెంట్లలో మహిళలకు 30 శాతం స్థానాలను కట్టబెట్టాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

KTR: సమంత విడాకులకు కేటీఆర్‌ కారణం.. కొండా సురేఖకు కవిత శుభాకాంక్షలు.. ఏంటిది?

Dinosaur-Era Discovery: రాజస్థాన్‌లో ఎముకలతో కూడిన అవశేషాలు.. డైనోసార్ యుగానికి చెందినవా?

జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్?

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

Show comments