Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలపై లైంగిక వేధింపులకు నో బ్రేక్: ఫిర్యాదు చేసేందుకు జడుసుకుంటున్న 70శాతం ఉద్యోగినులు..?

మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అట్టహాసంగా జరుపుకునేందుకు మహిళలు సన్నద్ధమవుతున్నారు. అయితే మహిళలపై అత్యాచారాలు, దురాగతాలు ఏమాత్రం తగ్గట్లేదనే వార్త వెలుగులోకి వచ్చింది. దేశంలో 2012 ఢిల్

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (16:40 IST)
మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అట్టహాసంగా జరుపుకునేందుకు మహిళలు సన్నద్ధమవుతున్నారు. అయితే మహిళలపై అత్యాచారాలు, దురాగతాలు ఏమాత్రం తగ్గట్లేదనే వార్త వెలుగులోకి వచ్చింది. దేశంలో 2012 ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ తరువాత లైంగిక వేధింపుల నిరోధకచట్టాన్నికేంద్రం తీసుకొచ్చింది.

మానవ వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలంటే ముఖ్యంగా ఉద్యోగినుల్లో భద్రతా భావం పెరగాలని ఫిక్కీ లాంటి సంస్థలు గతంలోనే సూచించాయి. అలాగే పనిచేసే చోట లైంగిక వేధింపుల్ని అరికట్టేందుకు కొన్ని నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.
 
అయితే ఉద్యోగినులు కార్యాలయాల్లో లైంగిక వేధింపులకు గురవుతున్నారని.. అయితే కార్యాలయాల్లో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు సగానికిపైగా ఉద్యోగినులు ముందుకు రావట్లేదని ఓ సర్వేలో తేలింది. పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2013 అమల్లోకి వచ్చినా.. దేశవ్యాప్తంగా లైంగిక వేధింపులు ఏమాత్రం తగ్గట్లేదని చెప్తున్నారు. అయితే ఈ లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన తర్వాత తదనంతర పరిణామాలకు భయపడి 70శాతం మహిళలు ఫిర్యాదు చేయడంలేదని ది ఇండియన్‌ బార్‌ అసోసియేషన్‌ 2017లో నిర్వహించిన సర్వేలో తెలిసింది.
 
ఓ వైపు మారుతున్న ఆర్థిక అవసరాల కారణంగా మహిళలు సైతం పురుషులకు సమానంగా ఉద్యోగాలు చేయాల్సి పరిస్థితి. దీంతో ఉద్యోగినుల సంఖ్య పెరగడంతో పాటు వారిపై లైంగిక వేధింపులు కూడా అమాంతం పెరిగిపోతున్నాయని సర్వేలో వెల్లడైంది. యజమానులు, అధికారులు, తోటి ఉద్యోగులు వారిని లైంగికంగా హింసిస్తున్నారని.. అయితే వాటిని దిగమింగుకుని ఎంతోమంది మహిళలు ఫిర్యాదు చేసేందుకు జడుసుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది.

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం