Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలపై లైంగిక వేధింపులకు నో బ్రేక్: ఫిర్యాదు చేసేందుకు జడుసుకుంటున్న 70శాతం ఉద్యోగినులు..?

మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అట్టహాసంగా జరుపుకునేందుకు మహిళలు సన్నద్ధమవుతున్నారు. అయితే మహిళలపై అత్యాచారాలు, దురాగతాలు ఏమాత్రం తగ్గట్లేదనే వార్త వెలుగులోకి వచ్చింది. దేశంలో 2012 ఢిల్

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (16:40 IST)
మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అట్టహాసంగా జరుపుకునేందుకు మహిళలు సన్నద్ధమవుతున్నారు. అయితే మహిళలపై అత్యాచారాలు, దురాగతాలు ఏమాత్రం తగ్గట్లేదనే వార్త వెలుగులోకి వచ్చింది. దేశంలో 2012 ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ తరువాత లైంగిక వేధింపుల నిరోధకచట్టాన్నికేంద్రం తీసుకొచ్చింది.

మానవ వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలంటే ముఖ్యంగా ఉద్యోగినుల్లో భద్రతా భావం పెరగాలని ఫిక్కీ లాంటి సంస్థలు గతంలోనే సూచించాయి. అలాగే పనిచేసే చోట లైంగిక వేధింపుల్ని అరికట్టేందుకు కొన్ని నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.
 
అయితే ఉద్యోగినులు కార్యాలయాల్లో లైంగిక వేధింపులకు గురవుతున్నారని.. అయితే కార్యాలయాల్లో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు సగానికిపైగా ఉద్యోగినులు ముందుకు రావట్లేదని ఓ సర్వేలో తేలింది. పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2013 అమల్లోకి వచ్చినా.. దేశవ్యాప్తంగా లైంగిక వేధింపులు ఏమాత్రం తగ్గట్లేదని చెప్తున్నారు. అయితే ఈ లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన తర్వాత తదనంతర పరిణామాలకు భయపడి 70శాతం మహిళలు ఫిర్యాదు చేయడంలేదని ది ఇండియన్‌ బార్‌ అసోసియేషన్‌ 2017లో నిర్వహించిన సర్వేలో తెలిసింది.
 
ఓ వైపు మారుతున్న ఆర్థిక అవసరాల కారణంగా మహిళలు సైతం పురుషులకు సమానంగా ఉద్యోగాలు చేయాల్సి పరిస్థితి. దీంతో ఉద్యోగినుల సంఖ్య పెరగడంతో పాటు వారిపై లైంగిక వేధింపులు కూడా అమాంతం పెరిగిపోతున్నాయని సర్వేలో వెల్లడైంది. యజమానులు, అధికారులు, తోటి ఉద్యోగులు వారిని లైంగికంగా హింసిస్తున్నారని.. అయితే వాటిని దిగమింగుకుని ఎంతోమంది మహిళలు ఫిర్యాదు చేసేందుకు జడుసుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం