Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి మహిళ రోజూ ఓ గ్లాసు పాలు తాగాలి.. ఎందుకో తెలుసా?

ప్రతి మహిళ రోజూ ఖచ్చితంగా ఓ గ్లాసు పాలు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనికి అనేక కారణాలు లేకపోలేదంటున్నారు. శరీరానికి అవసరమైన కనీస ప్రోటీన్లు, కొవ్వు పాల ద్వారానే అందుతాయన్నది ప్రతి ఒక్కరికీ

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (11:45 IST)
ప్రతి మహిళ రోజూ ఖచ్చితంగా ఓ గ్లాసు పాలు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనికి అనేక కారణాలు లేకపోలేదంటున్నారు. శరీరానికి అవసరమైన కనీస ప్రోటీన్లు, కొవ్వు పాల ద్వారానే అందుతాయన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయం. అయితే, మహిళల్లో వయసు పెరిగేకొద్ది కాల్షియం సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. దాంతో ఎముకలు బలహీనపడిపోతాయి. అందుకే మహిళలు ప్రతి రోజూ ఖచ్చితంగా పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
 
కాల్షియం.. ఎముకలను బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కాల్షియం కీళ్ళ నొప్పుల బారి నుండి కాపాడటంలో బాగా పనిచేస్తుంది. కాల్షియం పాల నుంచి ఎక్కువగా లభిస్తుంది. అందుకే మీరు ఒక గ్లాసు పాలను ప్రతి రోజూ తీసుకున్నట్లయితే మీ ఎముకలు బలంగా ఉంటాయి.
 
ఉదయం నిద్ర లేచినది మొదలుకుని రాత్రి పడక గదికి చేరేంత వరకు ప్రతి మహిళ ఎంతో శ్రమిస్తుంది. దీనివల్ల మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా బాగా అలసిపోతుంది. ఒత్తిడితో కూడుకున్న జీవితం సుఖ నిద్రకు దూరం చేస్తుంది. అందుకే నిద్రకు ముందు ఒక గ్లాసు పాలను తాగడం ఎంతో మంచింది. ఎందుకంటే... పాలల్లో ఉండే అమినో ఆసిడ్స్ మెదడులో ఏర్పడిన ఒత్తిడిని మాయం చేసి సుఖమయ నిద్రలోకి జారుకునేలా చేస్తుంది.
 
అలాగే, పాలల్లో ఉండే కాల్షియం మన శరీరం ఆరోగ్యంగా ఎదగడానికి అవసరమైన శక్తిని అందించి, మంచి ఎత్తు, బరువు పెరిగేలా చేస్తాయి. వాస్తవానికి మన శరీర ఎదుగుదలలో పాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మనం తీసుకునే ఆహారంలో పాలు అత్యంత బలవర్ధకమైన ఆహారం. కాబట్టి ప్రతిరోజూ ఓ గ్లాసు పాలు తాగి, అనారోగ్య సమస్యలకూ దూరంగా ఉండమని వైద్యులు సూచిస్తున్నారు.
 
చర్మ రక్షణ, సౌందర్యం కోసం ప్రతి రోజూ ఓ గ్లాసు పాలు తాగడం చాలా ఉత్తమం. పాలల్లో ఉండే అమినో ఆసిడ్స్ కాలుష్యం వల్ల మీ చర్మాన్ని హాని కారకాల నుండి కాపాడతాయి. చర్మం మెరిసిపోయేలా చేస్తాయి.

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments