Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూర్చుని పనిచేసే మహిళలకు క్యాన్సర్ ముప్పు: శారీరక శ్రమ ఉండాల్సిందే!

Webdunia
బుధవారం, 15 జులై 2015 (11:26 IST)
కంప్యూటర్ల పుణ్యమా అని ప్రస్తుతం గంటలు గంటలు వాటిముందు కూర్చుని పనిచేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. శారీరక శ్రమ లేకపోవడం, తరచూ కంప్యూటర్ల ముందు కూర్చోవడం ద్వారా లెక్కలేనన్ని రోగాలు సులభంగా వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా గంటల పాటు కూర్చుని పనిచేసే మహిళలకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. 
 
అయితే ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే మహిళల్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సుందని తాజా అధ్యయనంలో తేలింది. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా, ఎక్కువ సేపు కూర్చునే మహిళల్లో క్యాన్సర్ వచ్చే ముప్పు 10 శాతం ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం తేల్చింది. 
 
అయితే మగవారిలో మాత్రం ఎక్కువ సేపు కూర్చోవడానికి, క్యాన్సర్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. 1999 నుంచి 2009 వరకు దాదాపు 69 వేల మంది పురుషులు, 77 వేల మంది స్త్రీలపై కొనసాగిన పరిశోధనల్లో కూర్చుని పనిచేసే మహిళల్లోనే క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నట్లు తెలియవచ్చింది.

ఎక్కువ సేపు కూర్చునే పనిచేసే మహిళల్లో బ్రెస్ట్, ఓవరియన్, బ్లడ్ క్యాన్సర్ సోకే అవకాశం ఉన్నట్లు తేలింది. కాబట్టి మహిళలు క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే... శారీరక శ్రమకు కాస్త ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు.

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

Show comments