Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 పూటలూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి.?

Webdunia
మంగళవారం, 19 ఆగస్టు 2014 (17:54 IST)
ఆరోగ్యంగా ఉండాలా? అయితే మూడు పూటలూ ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే.. అల్పాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవడం మానకూడదు. అల్పాహారం ఆరోగ్యానికి, మెదడుకు బూస్ట్ లాంటిది. ఇది శరీరానికి కావలసిన పోషకాలను అందించడంతో పాటు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. అలసట, నీరసాన్ని దూరం చేస్తుంది. 
 
అల్పాహారం తీసుకోకపోతే.. ఆకలి పెరగడంతో చికాకు తప్పదు. మధ్యాహ్న భోజనంను తృప్తిగా తీసుకోలేకపోవడం జరుగుతుంది. అల్పాహారాన్ని మితంగా తీసుకోకపోవడం.. శుభ్రంగా మానేయడం ద్వారా ఒబిసిటీ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  
 
అల్పాహారాన్ని తప్పకుండా తీసుకోవడం ద్వారా శరీర బరువును నియంత్రించవచ్చును. అల్పాహారంలో  పీచుపదార్థాలుండేలా చూసుకోవాలి. అందుచేత కొవ్వు లేని ఆహారాన్ని తీసుకోవాలి. కోడిగుడ్డు, బీన్స్, పాల ఉత్పత్తులను బ్రేక్ ఫాస్ట్‌లో చేర్చుకోవడం ఉత్తమం. ఇంకా కూరగాయలు, పండ్లు కూడా తీసుకోవచ్చు. 
 
మధ్యాహ్నం : 
మధ్యాహ్న భోజనం 12.30 గంటల నుంచి 1.30 గంటల లోపు తీసుకోవాలి. వ్యాధులకు కారణం ఏదిపడితే తినడం, అల్పాహారం తీసుకోకపోవడమే. సరైన సమయంలో ఆహారం తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు
 
ముఖ్యంగా అల్పాహారం తీసుకున్న తర్వాత కొందరు చిరుతిళ్ళు తీసుకుంటారు. టీ, జ్యూస్ వంటివి తీసుకుంటారు. ఇవి మధ్యాహ్న భోజనంపై ప్రభావం చూపిస్తుంది. తద్వారా ఆకలేయకపోవడం.. భోజనాన్ని లేటుగా తీసుకోవడం వంటివి జరుగుతాయి. రోజంతా కష్టపడాల్సి వుండటంతో మధ్యాహ్న భోజనంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. భోజనం మానేయడం కూడదు. మధ్యాహ్న భోజనానికి తర్వాత పండ్ల రసం తీసుకోవచ్చు. నిమ్మ, ఆపిల్, ద్రాక్ష రసాలు తీసుకోవచ్చు.  
 
రాత్రి: 
రాత్రిపూట భోజనం మంచి నిద్రకు ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులతో కలిసి డిన్నర్ తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. నెలలో అధిక రోజులు తల్లిదండ్రులతో కలిసి తీసుకునే చిన్నారులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఒబిసిటీ సమస్య దూరమైనట్లు సర్వేలు చెబుతున్నాయి.  
 
మరో సర్వేలో తల్లిదండ్రులతో రాత్రిపూట కలిసి భోజనం చేసే టీనేజ్ పిల్లలు మద్యం, మత్తు పదార్థాలకు బానిస కావట్లేదనే విషయం తేలింది. ఇంకా బరువు తగ్గాలనుకునే వారు రాత్రి పూట భోజనాన్ని నిద్రపోయేందుకు మూడు గంటలకు ముందే తీసుకోవడం బెటరని పరిశోధనలు తేలుస్తున్నాయి. 

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

Show comments