ఖైరతాబాద్ శ్రీకైలాస విశ్వరూప మహాగణపతికి 5 టన్నుల లడ్డు

Webdunia
గురువారం, 28 ఆగస్టు 2014 (13:49 IST)
రేపు వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ శ్రీకైలాస విశ్వరూప మహాగణపతికి 5 టన్నుల లడ్డును తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి పంపేందుకు పంపుతున్నారు. 5,000 కిలోలు బరువున్న ఈ తాపేశ్వరం లడ్డును రూ. 15 లక్షల వ్యయంతో తయారు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ లడ్డును గవర్నర్ చేతులు మీదుగా గణేశునికి సమర్పించనున్నట్లు తెలియజేశారు.
 
ఏటేటా తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ ఈ ప్రసాదాన్ని సమర్పిస్తుంది. 2010లో 500 కిలోల లడ్డూతో ప్రారంభమైన ఈ ప్రసాద పంపిణీ ఈ ఏడాది 5000 కిలోలకు చేరిందని సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు తెలియజేశారు.
 
60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఖైరతాబాద్ గణపతిని ఈ ఏడాది శ్రీకైలాస విశ్వరూప మహాగణపతిగా నామకరణం చేశారనీ, తాము ఈ నెల 21న తనతోపాటు 16 మంది గణేష్ మాల ధరించి మహాలడ్డూ తయారీ పనులు ప్రారంభించి పూర్తి చేసినట్లు వెల్లడించారు. లడ్డూను భారీ ట్రాలీపై ఊరేగింపుతో ప్రత్యేక వాహనంలో ఖైరతాబాద్ తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

లేటెస్ట్

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

Show comments