Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 20 లక్షల వెండి గణపతి... చెన్నై మెరీనాలో నిమజ్జనంకు రెడీ

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2013 (13:37 IST)
WD
చెన్నైలోని ఉత్తరప్రాంతమయిన పులియంతోప్ అంటే జనం భయపడిపోతారు. ఈ ప్రాంతం హత్యలకు పెట్టిందిపేరు. అలాంటి పులియంతోప్ ప్రాంతవాసులు గణేష్ చతుర్థి సందర్భంగా రూ. 20 లక్షలు వెచ్చించి వెండి గణపతిని రూపొందించారు. ఈ వెండి గణనాధుని బరువు 19.03 కిలోలు. విశేషమేమంటే, ఈ వెండి గణపతిని చెన్నై మెరీనా సముద్ర తీరంలో నిమజ్జనం చేసేందుకు స్థానికులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ వారాంతంలో జరగబోయే నిమజ్జన కార్యక్రమంలో వెండి గణపతిని నిమజ్జనం చేయబోతున్నట్లు ఏసీపి పి.లోకనాథన్‌కు సమాచారం అందించారు. సముద్రంలోపల 10 కిలోమీటర్లు దూరం తీసుకెళ్లి విగ్రహాన్ని నిమజ్జనం చేయనున్నట్లు స్థానికులు తెలిపారు.

3 అడుగులు ఎత్తు ఉన్న వెండి గణపతికి భద్రతగా ముగ్గురు పోలీసులు, ఒక డీఎస్పీ ఉన్నారు. కాగా వెండి గణపతిని కర్నాటకలోని మైసూరు, రాజస్థాన్ ఉదయపూర్ నుంచి నిపుణులను రప్పించి తయారుచేసినట్లు గణేష్ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నవారు తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments