మినప పప్పుతో మిక్స్‌డ్ వెజిటబుల్ వడలు తయారీ ఎలా?

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (15:01 IST)
కావలసిన పదార్థాలు :
మినప్పప్పు... రెండు కప్పులు
శెనగపప్పు... అర కప్పు
క్యారెట్ తురుము... అర కప్పు
క్యాబేజీ తురుము... అర కప్పు
అల్లం, పచ్చిమిరప పేస్ట్... 5 టీస్పూన్లు
పుదీనా, కరివేపాకు తరుగు... ఒక కప్పు
ఉప్పు... సరిపడా
ఉల్లిపాయ తరుగు... అర కప్పు
నూనె... వేయించేందుకు సరిపడా
 
తయారీ విధానం :
ముందుగా మినప పప్పు, శనగపప్పులను మూడు గంటలపాటు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత వాటిలో నీటిని ఒంపేసి కొంచెం పలుకుగా ఉండేటట్లు గ్రైండ్ చేయాలి. దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని అందులో.. ఉల్లిపాయ తరుగు, క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము, అల్లం పచ్చిమిరప పేస్ట్, పుదీనా కరివేపాకు తరుగు, తగినంత ఉప్పువేసి బాగా కలుపుకోవాలి.
 
ఇప్పుడు బాణలిలో నూనెపోసి బాగా కాగిన తరువాత.. పై మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని వడల్లాగా వత్తి వేయాలి. రెండువైపులా బాగా ఎర్రగా కాలిన తరువాత తీసేయాలి. అంతే మినప్పప్పుతో మిక్స్‌డ్ వెజిటబుల్ వడలు రెడీ అయినట్లే...! వీటిని వేడిగా తిన్నా, చల్లారాక తిన్నా కూడా చాలా రుచికరంగా ఉంటాయి. ఇష్టమైనవాళ్లు ఈ వడలను ఎర్రకారం లేదా సాస్‌తో పాటు ఆరగించవచ్చు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వాకింగ్‌కు వెళ్లినా వదలరా? హైదరాబాదులో మహిళకు వేధింపులు.. వీడియో

ఆర్డర్ చేసిన వస్తువుల్ని డెలివరీ చేశాడు.. ఎంబీఏ విద్యార్థినిపై అత్యాచారం..

Rains in Hyderabad: తెలంగాణలో తేలికపాటి వర్షాలు- ఎల్లో అలర్ట్

మేనకోడలిపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. మానసిక వికలాంగురాలైనా..?

Woman: బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లోనే మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాప్ ఐకన్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ మైఖేల్ చిత్రానికి కాసుల వర్షం, వారంలోనే రూ. 2 వేల కోట్లు

మా అమ్మానాన్నా వివాహ తేదీని ఇందిరా గాంధీ నిర్ణయిచారు : అమీషా పటేల్

NTR: ఊసరవెల్లి 4K విడుదలలో బెంగుళూరు, తిరుపతిలో కార్యక్రమాలు

Chiranjeevi: చిరంజీవి, బాబీ సినిమా కోసం నిర్మాత మార్పు ?

Kajal: రసాయనాల దుర్వినియోగం నేపథ్యంగా కాజల్ అగర్వాల్.. ది ఇండియా స్టోరీ

Show comments