మినప పప్పుతో మిక్స్‌డ్ వెజిటబుల్ వడలు తయారీ ఎలా?

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (15:01 IST)
కావలసిన పదార్థాలు :
మినప్పప్పు... రెండు కప్పులు
శెనగపప్పు... అర కప్పు
క్యారెట్ తురుము... అర కప్పు
క్యాబేజీ తురుము... అర కప్పు
అల్లం, పచ్చిమిరప పేస్ట్... 5 టీస్పూన్లు
పుదీనా, కరివేపాకు తరుగు... ఒక కప్పు
ఉప్పు... సరిపడా
ఉల్లిపాయ తరుగు... అర కప్పు
నూనె... వేయించేందుకు సరిపడా
 
తయారీ విధానం :
ముందుగా మినప పప్పు, శనగపప్పులను మూడు గంటలపాటు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత వాటిలో నీటిని ఒంపేసి కొంచెం పలుకుగా ఉండేటట్లు గ్రైండ్ చేయాలి. దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని అందులో.. ఉల్లిపాయ తరుగు, క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము, అల్లం పచ్చిమిరప పేస్ట్, పుదీనా కరివేపాకు తరుగు, తగినంత ఉప్పువేసి బాగా కలుపుకోవాలి.
 
ఇప్పుడు బాణలిలో నూనెపోసి బాగా కాగిన తరువాత.. పై మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని వడల్లాగా వత్తి వేయాలి. రెండువైపులా బాగా ఎర్రగా కాలిన తరువాత తీసేయాలి. అంతే మినప్పప్పుతో మిక్స్‌డ్ వెజిటబుల్ వడలు రెడీ అయినట్లే...! వీటిని వేడిగా తిన్నా, చల్లారాక తిన్నా కూడా చాలా రుచికరంగా ఉంటాయి. ఇష్టమైనవాళ్లు ఈ వడలను ఎర్రకారం లేదా సాస్‌తో పాటు ఆరగించవచ్చు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సూర్యాపేటలో ఓ జానెడు ఉన్న వ్యక్తి మిగిలిండు... : సీఎం రేవంత్ రెడ్డి

కొండెక్కిన గుడ్డు... తెలంగాణాలో అమాంతం పెరిగిపోయింది...

టీడీపీ ఎంపీ రూ.వేల కోట్ల విలువ చేసే భూమిని కబ్జాకు ప్రయత్నం : తమ్ముడిపై అన్న ఫిర్యాదు

కడుపు నొప్పి అంటూ ఆస్పత్రికి వచ్చి వైద్యులపై దాడి చేసిన మహిళ

శ్రీవారి సేవలో అనంత్ అంబానీ... శ్రీనివాసుడికి భారీ విరాళం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కావ్యా మారన్‌ను అనిరుధ్ పెళ్లాడనున్నారా?

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో 'ఈఠ' టైటిల్ వివాదం ఏంటి?

నా భర్త గోవిందాకు అనేక మంది మహిళలతో సంబంధం ఉంది : భార్య సునీత అహుజా

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

Show comments