Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనీర్‌ హెల్త్ బెనిఫిట్స్.. పాలక్ పన్నీర్ తింటే మేలెంత?

పాలకూరలో ఐరన్, క్యాల్షియం, ఫోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉండే.. పాల ఉత్పత్తుల్లో ఒకటైన పనీర్‌లో అంతకుమించిన పోషకాలున్నాయి. పనీర్ తీసుకోవడం ద్వారా కీళ్ళ నొప్పులకు చెక్ పెట్టవచ్చు. బరువు తగ్గొచ్చును. క్యాన్

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (14:19 IST)
పాలకూరలో ఐరన్, క్యాల్షియం, ఫోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉండే.. పాల ఉత్పత్తుల్లో ఒకటైన పనీర్‌లో అంతకుమించిన పోషకాలున్నాయి. పనీర్ తీసుకోవడం ద్వారా కీళ్ళ నొప్పులకు చెక్ పెట్టవచ్చు. బరువు తగ్గొచ్చును. క్యాన్సర్‌ను అరికట్టవచ్చు. బీపీని నియంత్రించవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. ముడతలకు చెక్ పెట్టవచ్చు. జుట్టుకు పోషకాలను అందించవచ్చు. ఇలా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పనీర్‌తో పాలక్ పనీర్ చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేయండి.. 
 
కావలసిన పదార్థాలు :
పాలకూర తరుగు - నాలుగు కప్పులు 
నూనె, ఉప్పు - సరిపడా 
జీలకర్ర - ఒక టీ స్పూన్ 
దాల్చిన చెక్క- 2
బిర్యానీ ఆకులు -1  
ఉల్లి తరుగు - అరకప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీస్పూన్ 
పచ్చి మిర్చి తరుగు - ఒక టీ స్పూన్ 
మిరప పొడి - రెండు టీ స్పూన్లు 
పసుపు పొడి - ఒక టీ స్పూన్ 
గరం మసాలా - రెండు టీ స్పూన్లు 
పనీర్ తరుగు - పావు కేజీ  
నీరు - తగినంత 
పాలు - అరకప్పు
మొక్కజొన్న పిండి - ఒక టీ స్పూన్ 
 
తయారీ విధానం : 
ముందుగా ఓ పాత్రలో పాలకూర, అల్లం, పచ్చిమిర్చిని వేసి 7 నిమిషాల పాటు ఉడికించాలి. ఆపై పాలకూరను దించి పక్కనబెట్టేసుకోవాలి. ఈ మిశ్రమం ఆరిన తర్వాత మిక్సీలో పేస్టులా రుబ్బుకోవాలి. ఆపై స్టౌ మీద బాణలి పెట్టి అందులో నూనె పోసి వేగాక, జీలకర్ర, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి చేర్చాలి. దోరగా వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి. ఇందులో కాస్త గరం మసాలా పొడి చేర్చి.. రుబ్బి పెట్టుకున్న పాలక్ మిశ్రమాన్ని కలపాలి. తగినంత ఉప్పు, నీరు చేర్చుకుని మరిగించాలి. చివర్లో నేతిలో వేయించిన పనీర్ ముక్కల్ని కూరలో చేర్చుకోవాలి. ఆపై మొక్కజొన్న పిండి, పాలు చేర్చి రెండు నిమిషాలుంచి వెంటనే దించేసుకోవాలి. అంతే పాలక్ పనీర్ రెడీ అయినట్లే. ఈ కూరను వేడి వేడి రోటీలకు, దోసెలకు వడ్డిస్తే టేస్ట్ అదిరిపోతుంది. 

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

తర్వాతి కథనం
Show comments