ముందుగా బాణలిలో నూనెను వేసి వేడయ్యాక అందులో జీడిపప్పు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, కూరగాయల ముక్కలు వేసుకుని కాసేపటి వరకు వేయించుకోవాలి. ఆ తరువాత ఆ మిశ్రమంలో ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ వంటసోడా, ధనియాల పొడి, కొబ్బరిపొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇడ్లీపిండిలో కలుపుకుని ఇడ్లీ పాన్లో ఇడ్లీల్లా వేసుకుని వాటిపై జీడిపప్పు చల్లుకుని ఆవిరి మీద ఉడికించుకోవాలి. అంతే... వెజిటబుల్ ఇడ్లీ రెడీ.