2021-22లో జీడీపీ వృద్ధిరేటు 11 శాతం : విత్తమంత్రి నిర్మలా సీతారామన్

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (15:12 IST)
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఆ తర్వాత విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 
 
2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో జీడీపీ వృద్ధి రేటు 11 శాతంగా ఉంటుంద‌ని ఈ ఆర్థిక స‌ర్వే అంచ‌నా వేసింది. దేశ‌వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఆర్థిక స‌ర్వే ఈ అంచ‌నాకు వ‌చ్చింది. ఇక 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో వృద్ధి రేటు -7.7 శాతంగా ఉంటుంద‌ని కూడా చెప్పింది. 
 
కరనా కష్టకాలం తర్వాత ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌ళ్లీ సాధార‌ణ స్థాయికి చేరుకుంటోంద‌ని, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కావ‌డంతో సేవ‌లు, వినియోగం, పెట్టుబ‌డుల రంగాలు చాలా వేగంగా పుంజుకుంటాయ‌ని స‌ర్వే తెలిపింది.
 
గ‌తేడాది కొవిడ్ కార‌ణంగా ఒక్క వ్య‌వ‌సాయ రంగం త‌ప్ప మిగిలిన కాంటాక్ట్ ఆధారిత సేవ‌లు, త‌యారీ, నిర్మాణ రంగాలు తీవ్రంగా న‌ష్ట‌పోయిన‌ట్లు ఈ స‌ర్వే తేల్చింది. ఈ ఏడాది ప్ర‌భుత్వం త‌న 3.5 శాతం ద్ర‌వ్య‌లోటు ల‌క్ష్యాన్ని చేరుకోక‌పోవ‌చ్చ‌ని కూడా ఆర్థిక స‌ర్వే అంచ‌నా వేసింది. గ‌తేడాది -23.9 శాతానికి ప‌త‌న‌మైన వృద్ధి రేటు త‌ర్వాత మెల్ల‌గా కోలుకున్న విష‌యం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

Rajamouli: రాజమౌళి సినిమానుంచి తీసేసిన ఆ వ్యక్తే ది రాజా సాబ్ విఎఫ్.ఎక్స్ లేట్ చేస్తున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments