#EconomicSurvey2018 : వృద్ధిరేటు 7 - 7.5 శాతమే... అరుణ్ జైట్లీ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగించారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ఆర్థిక సర్వే 2017-18ను ప్రవ

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (13:50 IST)
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగించారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ఆర్థిక సర్వే 2017-18ను ప్రవేశపెట్టారు. 2017-18లో వృద్ధి రేటు 6.75 శాతంగా నమోదైందనీ, ఇది 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.0 నుంచి 7.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. 
 
ఇకపోతే, భారత ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) కొత్త ఊపునిచ్చిందన్నారు. జీఎస్టీ అమలు తర్వాత పారిశ్రామిక వృద్ధిరేటులో కొంత మందగమనం ఉందన్నారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో గణనీయంగా రాబడి పెరిగిందని తెలిపారు. వ్యవసాయేతర రంగాల్లో అనుకున్న దాని కన్నా ఉపాధి పెరిగిందని స్పష్టంచేశారు. 
 
పన్ను చెల్లింపుదారులు 50 శాతం పెరిగారు. జీఎస్టీ వల్ల చిన్న వ్యాపారుల నమోదు శాతం పెరిగిందన్నారు. ఇతర దేశాల కన్నా మన ఎగుమతులు బాగున్నాయని గుర్తుచేశారు. రాష్ట్రాల నుంచి విదేశీ ఎగుమతుల పెరుగుదల అధికంగా నమోదైందని తెలిపారు. ఎగుమతుల్లో 70 శాతం మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ నుంచే జరుగుతున్నట్టు చెప్పారు. 
 
నోట్ల రద్దు వల్ల మదుపుదారుల సంఖ్య పెరిగిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. వస్త్ర పరిశ్రమ ప్రోత్సాహకాలతో రెడిమేడ్ దుస్తుల ఎగుమతులు పెరిగాయన్నారు. వ్యవసాయ దిగుబడులపై వాతావరణం ప్రతికూల ప్రభావం చూపించిందన్నారు. ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన అనంతరం లోక్‌సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments