Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైట్లీ పద్దుల చిట్టా : రైతుల సంక్షేమానికి పెద్దపీట

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో 2018-19 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్టు ప్రకటించారు.

Webdunia
గురువారం, 1 ఫిబ్రవరి 2018 (11:28 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో 2018-19 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్టు ప్రకటించారు. ముఖ్యంగా, 2022కు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలన్న ఆశయంతో ముందుకు సాగుతూ, అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేస్తున్నట్టు చెప్పారు. అలాగే, రాజకీయాలతో ప్రమేయం లేకుండా పనిచేస్తున్నామనీ, వ్యవసాయం, మౌలిక సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణలకు తన బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. 
 
సహజ వనరులను పారదర్శక విధానంలో కేటాయిస్తున్నామని తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు సబ్సిడీలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 15 శాతం పెరుగుతాయని తెలిపారు. గ్రామీణ వ్యవసాయం, విద్యా రంగాలపై అధిక శ్రద్ధ చూపుతున్నట్టు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి రైతులకు లాభాలు రావాలన్నారు. ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల సంక్షేమ పథకాల ప్రయోజానాలన్నీ నిజయమైన లబ్ధిదారులకే అందాలన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments