Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిదంబరం బడ్జెట్ 2013 'మొండి ఱంపం'... వేతన జీవులకు నిరాశే

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2013 (23:33 IST)
PTI
ఆర్థిక మంత్రి చిదంబరం 2013 - 14 బడ్జెట్ ప్రవేశపెడుతుంటే వేతన జీవులంతా వ్యక్తిగత పన్ను మినహాయింపుపై ప్రకటన కోసం ఎదురుచూశారు. కానీ ఆయన ఐటీ శ్లాబులు గురించి ప్రకటించిన వెంటనే పెదవి విరిచారు. ఆయన బడ్జెట్ ఓ మొండి ఱంపం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. చిదంబరం ప్రకటించిన ఐటీ శ్లాబులు గురించి ఒక్కసారి చూద్దాం.

సంవత్సరాదాయం రూ. 2 లక్షల లోపు ఉన్నవారు ఆదాయపు పన్ను పరిధిలోకి రారు. రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకూ ఆదాయం ఉన్నవారిపై 10 శాతం పన్ను యధాతథంగా ఉంచారు. ఐతే రూ. 5 లక్షల ఆదాయం లోపు ఉన్నవారికి రూ. 2000 టాక్స్ క్రెడిట్ లభిస్తుంది.

ఇకపోతే రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల ఆదాయం ఆర్జించేవారిపై 20 శాతాం పన్ను గతంలో మాదిరిగానే ఉంటుంది. రూ. కోటి ఆదాయం ఉన్నవారిపై 30 శాతం పన్నుతో అదనంగా ఈ ఏడాది నుంచి 10 శాతం సర్ చార్జి ముక్కుపిండి వసూలు చేస్తారు. ఏతావాతా ఈ బడ్జెట్లో వేతన జీవులకు ఒరిగింది ఏమీ లేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Show comments