సాయికిరణ్ శ్రీకృష్ణుడు - సన ద్రౌపది

Webdunia
WD
" తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి".. అంటారు. ఇదే బ్యానర్‌గా పెట్టి సీతారామయ్యగారి మనవరాలు, అన్నమయ్య, సింహాద్రి చిత్రాల నిర్మాత దొరస్వామిరాజు మహాభారతం అనే మెగా సీరియల్‌ను నిర్మిస్తున్నారు. సారథి స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నన్నయ, పోతన, తిరుపతి వేంకట కవుల పద్యాలు నేటికీ తెలుగు వాకిట వినిపిస్తూనే ఉంటాయి. చెల్లియో చెల్లకో అంటూ పాడకుండా ఉండేవారే ఉండరు. తెలుగుజాతి జీవితంలో మమేకమైన భారతాన్ని పిన్నలు, పెద్దలు, యువకులు చూసి ఆనందించేటట్లుగా వి.ఎం.సి సంస్థ నిర్మిస్తోంది. కృష్ణుడిగా సాయికిరణ్, ద్రౌపదిగా సన నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో స్టేజి నటులు, ప్రముఖ నటీనటులు నటిస్తున్నారని చెప్పారు.

సీరియల్ దర్శకుడు ఉదయభాస్కర్ మాట్లాడుతూ... గతంలో హిందీలో వచ్చిన సీరియల్ కంటే మిన్నగా నిర్మించాలని ప్రయత్నిస్తున్నాం. ఘటోత్కచుని కుమారునికి భీముడు అన్ని విషయాలు చెప్పే సందర్భం నుంచి భారత కథ ప్రారంభమవుతుంది. దాదాపు 1000 ఎపిసోడ్లను ప్లాన్ చేస్తున్నాం. ప్రముఖ ఛానల్‌లో చూసి ప్రసారం చేస్తాం అన్నారు.

సాయికిరణ్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ వంటి మహామహులు చేసిన పాత్రను తాను పోషించడం ఆనందంగా ఉందన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: హైదరాబాద్-బెంగళూరు మధ్య కొత్త హై-స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్

ఈ-ఫార్ములా కేసు : అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు .. కేటీఆర్

భారత్- చైనా చేతులు కలిపితే అంతే సంగతులు.. అమెరికా కొత్త తలనొప్పి.. ఏంటది?

గవర్నర్లకు గడువు విధించేలా రాజ్యాంగ సవరణ తెచ్చేవరకు పోరాటం : సీఎం స్టాలిన్

వివాహేతర సంబంధం.. భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments