Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై వర్క్ ఫ్రమ్ హోం ... కార్మిక చట్టాన్ని సవరించే పనిలో... (video)

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (13:46 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ముఖ్యంగా, వైరస్ బారినపడకుండా ఉండేందుకు అనేక దేశాల్లో లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ కారణంగా అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటు కల్పించాయి. ఇదే సౌకర్యాన్ని మున్ముందు కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఈ వర్క్ ఫ్రం హోం విధానం కరోనా విపత్తు తొలగిపోయిన తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని ముందే గుర్తించిన కేంద్ర ప్రభుత్వం త్వరలోనే వర్క్ ఫ్రం హోంకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
 
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణ కోసం మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉందని సమాచారం. ముఖ్యంగా ఉద్యోగుల పనిగంటలు, పని వాతావరణం, వేతనం మొదలైన వాటిపై కేంద్రం తన మార్గదర్శకాల్లో ప్రత్యేకంగా పేర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
వర్క్ ఫ్రం హోంకు సంబంధించి ప్రస్తుత కార్మిక చట్టంలో ఎటువంటి మార్గదర్శకాలు లేవు. ఈ నేపథ్యంలో ప్రత్యేక మార్గదర్శకాలు అవసరమని ప్రభుత్వం భావిస్తున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ మార్గదర్శకాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటును కల్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments