Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏనుగు విగ్రహం కాళ్ల మధ్య దూరిన మహిళ..అలా ఇరుక్కుపోయింది... వైరల్ వీడియో

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (16:39 IST)
ఫోటో కోసం ఫోజిచ్చింది. తర్వాతే ఆమెకు చుక్కలు కనిపించాయి. ఆలయానికి వెళ్ళామా.. దేవుడిని దర్శించామా అని లేకుండా.. ఓ చిన్నపాటి ఏనుగు బొమ్మ కాలి మధ్య దూరింది.


అంతే అదే ఆమెకు ఇబ్బందులకు గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇంకా పిచ్చపిచ్చగా కామెంట్లు చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన ఓ మహిళ కొద్దిరోజుల క్రితం ఓ గుడికి వెళ్లింది. ఈ సందర్భంగా గుడిలో ఉన్న ఏనుగు బొమ్మతో ఫొటో దిగాలనుకుందామె. అయితే అందరిలాగా ఫొటో దిగితే ఏం వెరైటీ అనుకుందో ఏమో కానీ.. ఏనుగు బొమ్మ కిందకు అతికష్టం మీద దూరింది. అనంతరం తన స్టైల్లో ఫొటోకు ఫోజిచ్చింది. అంతే ఏనుగు కాళ్ల మధ్యలోనే చిక్కుకుపోయింది. 
 
ఇక ఆ ఏనుగు విగ్రహం కాళ్ల మధ్యలోకి చిక్కుకున్న ఆమెను అక్కడున్న మహిళలు ముందు వెనకా తోసి బయటికి లాగారు. ముందు నుంచి కొందరు లాగడం వెనక నుంచి కొందరు ఆమెను తోయడంతో కొద్ది నిమిషాల తర్వాత ఆమె విగ్రహం నుంచి బయటపడింది. 
 
ఈ వీడియోను ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. దీంతో క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియోపై కామెంట్లు పేలుతున్నాయి. షేర్లు వెల్లువెత్తుతున్నారు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments