Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రం ఓ చిట్ ఫండ్ కంపెనీనా?

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (17:52 IST)
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 219-20 సంవత్సర మధ్యంతర బడ్జెట్‌పై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ, తమ రాష్ట్రంలో అమలు చేస్తున్న అనేక పథకాలను కేంద్రం పక్కాగా కాపీ కొట్టిందన్నారు. 
 
తాము ఇప్పటికే అమలు చేస్తున్న వాటిని కేంద్రం ఇవాళ కొత్తగా ప్రకటించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చిట్‌ఫండ్‌ కంపెనీ మాదిరిగా మారిందని ధ్వజమెత్తారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. 
 
రాష్ట్రాలను సంప్రదించకుండానే ఎలా నిర్ణయం తీసుకుంటారు అని ప్రశ్నించారు. రాష్ట్రాలు చేసిన మంచిని కూడా కేంద్రం తమ గొప్పలుగా చెప్పుకుంటుందని మండిపడ్డారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రచార యావ తప్ప.. ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదని నిప్పులు చెరిగారు. ప్రజలను మోసం చేయడానికి బడ్జెట్‌ను బీజేపీ మేనిఫెస్టోలా తయారు చేశారని మమతా బెనర్జీ ఆగ్రహం వెలిబుచ్చారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments