Bullet Bandi: ఒక్క డ్యాన్స్‌తో ఓవర్ నైట్ సెలబ్రిటీ, ఎవరు..?

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (00:01 IST)
ఒకే ఒక్క పాట ఆమెను సెలబ్రిటీని చేసేసింది. అసలు ఆమె వేసిన డ్యాన్స్ అందరినీ బాగా ఆకట్టుకుంది. పెళ్ళి కొడుకు ఉండగానే అతని ముందుగానే ఇష్టమొచ్చినట్లు డ్యాన్స్ వేస్తూ అందరినీ ఆకట్టుకుంది. మొదట్లో పెళ్ళి కొడుకు కాసేపు డ్యాన్స్ వేశాడు కానీ ఆ తరువాత ఎక్కువసేపు డ్యాన్స్ వేయలేకపోయాడు. ఆ యువతి ఎవరన్నది ఇప్పుడు అందరిలోను ఆసక్తికరంగా మారింది.
 
ఆమె పేరు సాయిశ్రియ. మంచిర్యాలకు చెందిన యువతి. అటవీశాఖ ఉద్యోగి ఎఫ్ఎస్ ఓ రాము, సురేఖ దంపతుల పెద్ద కుమార్తె. రామక్రిష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో ఈనెల 14వ తేదీన వివాహం జరిగింది. అయితే ఈ వివాహం జరిగిన తరువాత ఇంటికి వచ్చినప్పుడు భార్యాభర్తలిద్దరూ డ్యాన్స్ వేశారు. 
 
సాయిశ్రియ మాత్రం ఎంతో అద్భుతంగా డ్యాన్స్ వేసింది. ఆ వీడియో కాస్త బాగా వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అసలు ఆ యువతి అన్న విషయాన్ని అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సాధారణ యువతి ఆ స్థాయిలో డ్యాన్స్ వేయడంతో అందరూ మెచ్చుకుంటున్నారు. ఆ డ్యాన్స్‌తో బుల్లెట్ బండికి పాటకు మంచి పేరే వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: మార్చి నెల ఉస్తాద్ గబ్బర్ సింగ్‌కు కలిసి వచ్చేలా వుంది

Sathya: నాగ చైతన్య చిత్రం వృషకర్మ లో సత్య లుక్‌

Srinath: మెన్షన్ హౌస్ మల్లేష్ నిజాయితీగా తీసిన సినిమా: శ్రీనాథ్ మాగంటి

Anantha Sriram: యూత్ కి ఒక యాంథమ్ లాగా ఉండాలనే రై రై రారా. పాట రాశాం : అనంత శ్రీరామ్

Bandla Ganesh: ఓటీటీ వద్దని సాయి, నితిన్‌కు ఫోన్‌ చేసి థియేటర్‌లో చేయమని చెప్పా : బండ్ల గణేష్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తర్వాతి కథనం
Show comments