Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే రోజు బాబుకు రెండు దెబ్బలు: తెలంగాణలో టిడిపి క్లోజ్, వైసిపిలోకి తెదేపా మాజీ ఎమ్మెల్యే

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (20:30 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఒకే రోజు రెండు దెబ్బలు తగిలాయి. ఒకటి తెలంగాణ నుంచి అయితే మరొకటి ఏపీ నుంచి.
 
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు గెలిచారు. ఆ ఇద్దరిలో ఒకరు సండ్ర వెంకట వీరయ్య కాగా మరొకరు మెచ్చా నాగేశ్వర రావు. వీరిరువురిలో సండ్ర కొద్దికాలానికే కారు ఎక్కేశారు. దాంతో మెచ్చా మాత్రమే మిగిలిపోయారు. అలా తెలంగాణలో తెదేపాకి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు.
 
ఐతే ఈరోజు ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూడా తెరాస తీర్థం పుచ్చుకున్నారు. దానితో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖతమైపోయినట్లయింది. తమ పార్టీని తెరాసలో విలీనం చేస్తున్న సండ్రతో కలిసి మెచ్చ స్పీకర్ పోచారానికి లేఖ ఇచ్చారు. దీనితో ఆ పార్టీ ఇక తెలంగాణలో కనుమరుగైపోయినట్లే.
 
ఇక ఏపీ విషయానికి వస్తే... బాపట్ల నియోజకవర్గంలో ఎప్పటి నుంచి రాజుల కమ్యూనిటీ తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది. అలాంటిది ఈరోజు తెదేపాకి చెందిన బాపట్ల మాజీ ఎమ్మెల్యే అనంతవర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపి కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పలువురు నాయకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా ఒకే రోజు చంద్రబాబుకి రెండు దెబ్బలు తగిలాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

Avika Gor: ప్రియుడు మిలింద్ చంద్వానీతో అవికా గోర్ నిశ్చితార్థం

ఈ ఏడాది సక్సెస్ లు పెద్దగా లేవు, పారితోషికం గురించి అందరూ ఆలోచించాలి: దిల్ రాజు

శేఖర్ కమ్ముల తో మరో సినిమా చేయనున్నాం : సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments