Webdunia - Bharat's app for daily news and videos

Install App

దూసుకెళ్ళిన ఖాళీ గూడ్సు రైలు - వలస కూలీల మృతి.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (09:01 IST)
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ఓ ఖాళీ గూడ్సు రైలు దూసుకెళ్లడంతో ఏకంగా 15 మంది వలస కూలీలు మృత్యువాతపడ్డారు. ఈ ఘోరం శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మృతి చెందిన వలస కార్మికులంతా ట్రాక్‌పై నిద్రిస్తుండటంతో ఈ విషాదం జరిగింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాదా - నాందేడ్ రైల్వే మార్గంలో జరిగింది. చనిపోయిన వారంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలే.
 
కరోనా వైరస్ దెబ్బకు దేశం మొత్తం లాక్డౌన్‌లో ఉంది. దీంతో అనేక ప్రాంతాల్లో వలస కూలీలు, కార్మికులు చిక్కుకునిపోయారు. తమతమ ప్రాంతాలకు వెళ్లేందుకు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన షెల్టర్లలో తలదాచుకుంటున్నారు.
 
ఈ క్రమంలో ఔరంగాబాద్ - నాందేడ్ రైలు మార్గంలో కొంతమంది వలస కూలీలు గురువారం రాత్రి భోజనం చేసి ట్రాక్‌పై నిద్రిస్తున్నారు. ఆ సమయంలో ఓ ఖాళీ గూడ్సు రైలు పట్టాలపై నిద్రిస్తున్న వలస కార్మికులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మంది మరణించినట్టు ప్రాథమిక సమాచారం. వీరంతా మధ్యప్రదేశ్ కు చెందిన కార్మికులుగా తెలుస్తోంది.
 
దీనిపై దక్షిణ మధ్యరైల్వే ప్రజా సంబంధ వ్యవహారాల అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. 'కర్మాడ్ ప్రాంతంలో రైలు ప్రమాదం జరిగింది. ఖాళీగా వెళుతున్న గూడ్స్ రైలు కొంతమందిపై నుంచి వెళ్లింది. విషయం తెలుసుకున్న వెంటనే, రైల్వే, స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మరింత సమాచారం వెలువడాల్సివుంది' అని పేర్కొన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అనన్య నాగళ్ల లాంచ్ చేసిన 23 మూవీ కోసీ కోయ్యంగానే సాంగ్

ఓదెల 2 సినిమా బడ్జెట్ గురించి మేము ఆలోచించలేదు : నిర్మాత డి మధు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments