Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో కెమెకల్ గ్యాస్ లీక్ ... ముగ్గురు మృతి - 200 మందికి అస్వస్థత

Webdunia
గురువారం, 7 మే 2020 (08:48 IST)
సముద్రతీర ప్రాంతం విశాఖపట్టణంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీకైంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 200 మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. చనిపోయిన వారిలో ఇద్దరు వృద్ధులు, ఓ బాలిక ఉంది. అస్వస్థతకు గురైనవారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గురువారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వైజాగ్‌లో ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ ఉంది. ఈ ఫ్యాక్టరీ నుంచి విషపూరిత రసాయన వాయువు లీకైంది. ఈ వాయువు సుమారు మూడు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించింది. దీనిని పీల్చిన వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 
 
చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఈ గాలి పీల్చిన కొందరు రోడ్డుపైనే పడిపోయారు. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో కంపెనీని తెరిచే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. 
 
పరిశ్రమ నుంచి స్టెరైన్ అనే విష వాయువు లీకైనట్లు చెబుతున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు కంపెనీకి ఐదు కిలోమీటర్ల  పరిధిలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 25 అంబులెన్సులు, పోలీసు వాహనాలతో బాధితులను కేజీహెచ్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. 
 
అలాగే, విధుల్లో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ఓ కానిస్టేబుల్ ఈ వాయువు పీల్చి రోడ్డుపైనే కుప్పకూలాడు. గుర్తించిన స్థానికులు అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనను కేజీహెచ్‌కు తరలించారు.

 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments