Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇదే నా ఆఖరి టిక్‌టాక్‌ వీడియో' అంటూ విషం తాగి.. భర్తకు పంపింది..

Webdunia
గురువారం, 13 జూన్ 2019 (10:55 IST)
టిక్‌టాక్‌' మరొకరి ప్రాణాలను తీసింది. టిక్‌టాక్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేస్తున్న భార్యను భర్త మందలించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. చనిపోతూ వీడియో తీసి టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేయడం సంచలనంగా మారింది. 
 
తమిళనాడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అరియలూరు జిల్లా సెందురైలోని వంగారం గ్రామానికి చెందిన అనిత(24)తో పళనివేలుకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది.

వీరికి ఇద్దరు పిల్లలు. పళనివేలు సింగపూర్‌లో పనిచేస్తుండగా ఇద్దరు పిల్లలతో అనిత పెరంబలూరులో ఉంటోంది. అనిత.. టిక్‌టాక్‌కు బానిసగా మారింది. నిత్యం పదుల సంఖ్యలో వీడియోలను అప్‌లోడ్‌ చేసేది. 
 
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పిల్లలకు దెబ్బ తగిలి గాయపడ్డారు. అప్పుడు కూడా అనిత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బంధువుల ద్వారా ఆ విషయం పళనివేలుకు తెలిసింది. పిల్లలకు దెబ్బలు తగిలినా పట్టించుకోకుండా టిక్‌టాక్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేయడమేంటంటూ ఫోన్‌ చేసి మందలించాడు. 
 
మనస్తాపం చెందిన అనిత 'ఇదే నా ఆఖరి టిక్‌టాక్‌ వీడియో' అని పేర్కొంటూ వీడియో తీస్తూ పురుగుల మందు తాగేసింది. ఆ వీడియోను అప్‌లోడ్‌ అయిన కొద్దిసేపటికే ఆమె మరణించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments