ఏపీ రాజధాని అమరావతి కాదా? మరికొద్దిరోజుల్లో అక్కడ కన్ఫర్మ్

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (17:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అనీ, నగర నిర్మాణం కోసం 30 వేల ఎకరాలను గత ప్రభుత్వం సమీకరించింది. ఐతే ఆ భూముల్లో రాజధాని నిర్మాణం సురక్షితం కాదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వాదిస్తూ వస్తున్నారు. మరోవైపు అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అక్కడ పనులు చేసే కార్మికులు కూడా వెళ్లిపోయారు. అలా అమరావతి రాజధాని నగరంలో నిర్మాణాలు ఆగాయి.
 
ఇక అసలు విషయానికి వస్తే, కొత్తగా ఏపీ రాజధాని అమరావతి నుంచి నేరుగా మంగళగిరికి మార్చుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వెలగపూడిలో వున్న కార్యాలయాలను మంగళగిరికి తరలించాలన్న యోచనలో జగన్ సర్కార్ వున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం కూడా అదేనని అంటున్నారు. అమరావతి రాజధాని ఏపీకి అనువైంది కాదనీ, మంగళగిరి అయితే అన్నివిధాలా సరిపోతుందని వైసీపీ నాయకులు అంటున్నారు. 
 
ఈ నేపధ్యంలో త్వరలో మంగళగిరి ఏపీ రాజధానిగా నిర్ణయిస్తూ ప్రకటన వెలువడే అవకాశం వుందంటున్నారు. అంతేకాదు... హైకోర్టును కర్నూలుకి తరలించాలనీ, ఇతర ముఖ్యమైన కార్యాలయాలను విశాఖలో పెట్టేందుకు గల అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments