Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాది: ఐరాస, అలాగేనన్న చైనా

Webdunia
బుధవారం, 1 మే 2019 (20:02 IST)
ఉగ్రవాద కార్యకలాపాలతో నిత్యం తలమునకలయ్యే జైషె మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. దీనితో ఎన్నో ఏళ్లుగా భారతదేశం చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది.
 
పుల్వామా దాడి అనంతరం భారతదేశం అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి తెచ్చింది. దాడికి సంబంధించిన పూర్తి ఆధారాలను సమితి ముందు ఉంచడంతో ఈ మేరకు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఐతే అంతకుముందు వరకూ మసూద్ అజర్ విషయంలో మోకాలడ్డిన చైనా కూడా గత్యంతరం లేని పరిస్థితిలో సభ్యదేశాల నిర్ణయానికి మద్దతు తెలిపింది. 
 
మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి సభ్యదేశాలలో మెజారిటీ ఆమోదం తెలిపినప్పటికీ చైనా నాలుగుసార్లు అడ్డుకుంది. కానీ పుల్వామా దాడి తర్వాత ఇక చైనా చేయి దాటిపోయింది. దీనితో మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments