ఉత్తమ్ కోటలో వికసించిన గులాబీ : 33 వేల ఓట్ల మెజార్టీ

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (14:47 IST)
తెలంగాణ రాష్ట్రంలో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికలను ఇటు తెరాస, అటు కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో విజయం కోసం ఇరు పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారం చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం చేపట్టగా, మధ్యాహ్నం రెండున్నర గంటలకే తుది ఫలితాన్ని వెల్లడించారు. ఈ ఫలితంలో తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. ఈయనకు లక్షా ఎనిమిదివేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. 
 
అలాగే, కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డికి 74638 ఓట్లు పోలయ్యాయి. దీంతో తెరాస అభ్యర్థి 33363 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో తెదేపా తరపున పోటీ చేసిన అభ్యర్థిగానీ, బీజేపీ అభ్యర్థిగానీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా ఉత్తమ్ కంచుకోటగా ఉన్న హుజూర్ నగర్ స్థానం ఇపుడు తెరాస వశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments