Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమ్మ కులంలో చెడపుట్టిన వ్యక్తి చంద్రబాబు .. జగన్, పవన్ ఏకమైతే అంతే : మోత్కుపల్లి

స్వర్గీయ ఎన్టీఆర్ 96వ జయంతి వేడుకలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా, టీడీపీ శ్రేణులు తమ అభిమాన నటుడు, అభిమాన రాజకీయనేత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి.తెలంగాణ రాష్ట్ర టీడీపీ

Webdunia
సోమవారం, 28 మే 2018 (15:09 IST)
తెలంగాణ రాష్ట్ర టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యుక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై మాటల తూటాలు పేల్చుతున్నారు. కమ్మకులంలో చెడపుట్టిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌లు ఏకమైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతేనని ఆయన జోస్యం చెప్పారు.
 
ఆయన సోమవారం ఎన్టీఆర్ 96వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్‌కు నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. తెలుగుదేశం పార్టీ బాగుండాలంటే ఎన్టీఆర్ వారసులకు పార్టీని అప్పగించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమన్న ఆయన... కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా చంద్రబాబు కుట్రలు చేశారని ఆరోపించారు. 
 
జూనియర్ ఎన్టీఆర్‌తో ఎన్టీఆర్ కుటుంబసభ్యులంతా కూర్చొని మాట్లాడాలని... తామంతా ఏపీకి వచ్చి ప్రచారం చేస్తామని చెప్పారు. కమ్మ కులంలో చంద్రబాబు చెడపుట్టారని తీవ్రవ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు కూడా తాను ఒక విన్నపం చేస్తున్నానని... ఎన్టీఆర్ కోసం ఒక స్థూపం ఏర్పాటు చేయాలని మోత్కుపల్లి కోరారు. కేసీఆర్ కూడా ఎన్టీఆర్ శిష్యుడేనని చెప్పారు. 
 
అంతేకాకుండా, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌లు కలిసి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు అవుతాయని జోస్యం చెప్పారు. మాల, మాదిగల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టారంటూ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments