Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవత్వం లేని అగ్రవర్ణాలు.. శవాన్ని వంతెనపై నుంచి జారవిడిచి... (Video)

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (17:36 IST)
తమిళనాడు రాష్ట్రంలో మానవత్వానికే మచ్చ తెచ్చే సంఘటన ఒకటి జరిగింది. చనిపోయిన ఓ దళితుడి మృతదేహాన్ని తమ ఇళ్లు, పంట పొలాల్లో తీసుకెళ్లడానికి వీల్లేదంటూ అగ్రవర్ణాలకు చెందిన ప్రజలు హుకుం జారీ చేశారు. దీంతో ఆ దళితుడి మృతదేహాన్ని వంతెనపై నుంచి జారవిడిచి శ్మశానవాటికకు తరలించి ఖననం చేశారు. ఈ విచారకర సంఘటన రాష్ట్రంలోని వెల్లూరు జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వెల్లూరు జిల్లా వాణియంబాడికి చెందిన ఎన్‌.కుప్పమ్‌ (46) అనే వ్యక్తి శనివారం ప్రాణాలు కోల్పోయాడు. అయితే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి తమ పొలం నుంచి శవాన్ని తీసుకెళ్లేందుకు అగ్రవర్ణాల వారు అంగీకరించలేదు. పైగా, పురాతనమైన ఆది ద్రావిడర్‌ శ్మశాన వాటికకు ఈ పంట పొలాల నుంచే వెళ్లాల్సి ఉంటుంది. 
 
అయితే, ఆ పొలాల మీదుగా శవాన్ని తీసుకెళ్లడానికి పొలాల యజమానులు సమ్మతించలేదు. దీంతో వంతెన కింద నుంచి మృతదేహాన్ని తరలించారు. ఇందుకోసం కుటుంబసభ్యులు ఆ మృతదేహాన్ని 20 అడుగుల ఎత్తు నుంచి వంతెన కిందకు తాళ్ల సాయంతో జారవిడిచారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments