Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశీయులకు వీధికుక్కలు స్వాగతం పలకడమా.. రాజమౌళి స్వీట్ వార్నింగ్

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (11:35 IST)
ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో జ‌క్క‌న్న బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలు మినహా షూటింగ్‌ మొత్తం పూర్తి అయ్యిందని ఇటీవ‌ల చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఇప్పటికే రెండు భాషల్లో డబ్బింగ్‌ పూర్తిచేశారు. ఇతర భాషలకి త్వరలోనే డబ్బింగ్‌ చెప్పనున్నారని చిత్ర బృదం తెలిపింది.
 
ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ ఎయిర్ పోర్టులో జక్కన్న చేదు అనుభవం మిగిలింది. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ యాజ‌మాన్యానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. రీసెంట్‌గా దేశ రాజ‌ధానికి ఢిల్లీకి వెళ్లిన రాజ‌మౌళికి అక్క‌డ ఎయిర్‌పోర్ట్‌లో క‌నిపించిన దృశ్యాలు చాలా బాధ క‌లిగించాయి. వెంట‌నే త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని యాజ‌మాన్యానికి తెలిపే ప్ర‌య‌త్నం చేశాడు. భారతదేశ ప్రతిష్ట కోసం వాటిపై దృష్టి పెట్టాలని కోరాడు.
 
 
క‌నీసం ఎయిర్ పోర్ట్ గోడ‌ల‌పైన అయిన ఉంటాయేమో అని చూసాను. ఎక్క‌డ ఆ స‌మాచారం లేదు. ఇక ఎగ్జిట్ గేట్ దగ్గ‌ర ఆక‌లితో ఉన్న‌ వీధి కుక్క‌లు గుంపులుగా ద‌ర్శ‌న‌మిచ్చాయి. విదేశాల నుండి వ‌చ్చిన పాశ్చాత్యుల‌కు ఇలాంటి దృశ్యాల‌తో స్వాగ‌తం ప‌ల‌క‌డం దేశ గౌర‌వానికి అంత మంచిది కాదు. ఇలాంటి దుర్భ‌ర ప‌రిస్థితుల‌పై దృష్టి పెడ‌తార‌ని ఆశిస్తున్నాను అంటూ రాజ‌మౌళి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments