Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యపై మరుతీర్పు లేదు.. ఆ తీర్పే ఫైనల్ : సుప్రీంకోర్టు

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (17:01 IST)
అయోధ్యపై మరు తీర్పు లేనేలేదని, నవంబరు 9వ తేదీన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పే అంతిమ తీర్పు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు నవంబరు 9న రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ కోరుతూ మొత్తం 18 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటినీ విచారణకు స్వీకరించకుండా తోసిపుచ్చింది. 
 
పైగా, అయోధ్య కేసులో నవంబరు 9వ తేదీన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పే ఫైనల్ అని తేల్చిచెప్పింది. ఆలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆనాటి తీర్పులో ఎలాంటి మార్పు ఉండదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే తేల్చి చెప్పారు. 
 
కాగా, నవంబరు 9వ తేదీన అప్పటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం దశాబ్దాల అయోధ్య వివాదంపై చారిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయం తెల్సిందే. ఈ తీర్పుపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేశారు. అయితే, కొన్ని ముస్లిం బాడీలు మాత్రం తీర్పుపై రివ్యూ కోరుతూ పిటిషన్లు దాఖలు చేయగా, వాటిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments