Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై మేయర్ ఎన్నికలు.. సోనూసూద్ ఏమన్నారంటే..?

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (18:27 IST)
2022లో నిర్వహించనున్న బఅహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బి.ఎం.సి) ఎన్నికల్లో మేయర్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సోనూసూద్‌ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై సోనూసూద్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని, సామన్య వ్యక్తిగా నేను చాలా ఆనందంగా ఉన్నానని అన్నారు.
 
కాగా... లాక్‌డౌన్‌ సమయంలో పలువురికి సాయం చేసి రియల్‌ హీరోగా నిలిచారు సోనూసూద్‌. పలు సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ పలువురు అభిమానులు కోరుతుండగా.. మరికొందరు రాజకీయాల్లోకి రావద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. బిఎంసి ఎన్నికల్లో ఈ సారి గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సెలబ్రిటీలని ఎంపిక చేసుకుందని, ఆ జాబితాలో సోనూతోపాటు మరో నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌, మోడల్‌, ఫిట్‌నెస్‌ పర్సనాలిటీ మిలింద్‌ సోమన్‌లు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 
 
త్వరలోనే ఈ ముగ్గురిలో ఒకరిని మేయర్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం సాగింది. వీరిలో రితేష్‌ దేశ్‌ముఖ్‌ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ తనయుడు కూడా. కాగా, ఈ వార్తలను సోనుసూద్ కొట్టిపారేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

Danger Boys: మరో మంజమల్ బాయ్స్ ఈ డేంజర్ బాయ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments