Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూ సూద్ ఫోటో స్టోరీ.. స్పందించిన షావోమి ఇండియా ఎండీ

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (20:53 IST)
Sold Cow
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కరోనా కష్టకాలంలో వలస కార్మికుల కోసం బస్సులు నడిపారు. ఆపై పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపట్టారు. తాజాగా సోషల్ మీడియాలో సోనూ సూద్ పిల్లల ఆన్‌లైన్‌ చదువుల కోసం కుటుంబ పోషణకు ఆధారణమైన ఆవును అమ్ముకున్న వైనంపై ఓ ఫోటో స్టోరీని షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. 
 
దీనిపై ప్రముఖ మొబైల్‌ తయారీదారు షావోమి ఇండియా ఎండీ మను కుమార్‌ జైన్‌ స్పందించారు. హృదయాన్ని కదిలించే అంశమంటూ ఆ కుటుంబానికి సాయం అందించేందుకు జైన్‌ ముందుకొచ్చారు. వారి పిల్లల విద్యాభ్యాసానికి సాయం చేస్తామని కూడా ప్రకటించారు. 
 
ఈ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌ నిత్యావసరమైన వస్తువుగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ఆన్‌లైన్‌ చదువులు, వర్క్‌ ఫ్రం హోం లాంటి వాటికి స్మార్ట్‌ఫోన్‌ చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. 
 
ఈ ట్వీట్‌కు నెటిజన్లు స్పందించడంతో షావోమి టీం బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులను అందించిందని జైన్‌ తెలిపారు. అలాగే బిడ్డల చదువుకు ఎలా సాయం చేయాలనేదానిపై చర్చిస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments