Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు.. ఇందిరకు పట్టిన గతే మోడీకి : శరద్ పవార్

దేశంలో 1977నాటి ఎమర్జెన్సీ పరిస్థితులే నెలకొనివున్నాయనీ, అందువల్ల నాడు ఇందిరా గాంధీకి పట్టిన గతే ఇపుడు ప్రధాని నరేంద్ర మోడీకి కూడా పడుతుందని ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ జోస్యం చెప్పా

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (09:02 IST)
దేశంలో 1977నాటి ఎమర్జెన్సీ పరిస్థితులే నెలకొనివున్నాయనీ, అందువల్ల నాడు ఇందిరా గాంధీకి పట్టిన గతే ఇపుడు ప్రధాని నరేంద్ర మోడీకి కూడా పడుతుందని ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ జోస్యం చెప్పారు. నాడు ప్రజాస్వామ్యాన్ని ఇందిర భూస్థాపితం చేస్తే.. నేడు మోడీ కూడా అదే పని చేస్తున్నారని మండిపడ్డారు.
 
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో భండారా-గోండియా లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎన్సీపీ అభ్యర్థి మధుకర్‌ కుకడేతో సమావేశం తర్వాత శరద్ పవార్ మాట్లాడుతూ... నాడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడడంతో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయని, ఇపుడు కూడా అదే పరిస్థితి నెలకొందన్నారు. ఆ ఫలితమే ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి అని వ్యాఖ్యానించారు. భావసారూప్యత ఉన్న పార్టీలను ఏకం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు.
 
పార్టీలతో విభేదాలున్నప్పటికీ బీజేపీని ఓడించేందుకు మాత్రం అంతా కలిసి కట్టుగా ముందుకు రావాలని పవార్ పిలుపునిచ్చారు. ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్, కర్ణాటకలో జేడీఎస్, మహారాష్ట్రలో ఎన్సీపీ, కేరళలో లెఫ్ట్, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్రలో కాంగ్రెస్ బలంగా ఉందని పవార్‌ వివరించారు. ఇవన్నీ ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments