Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ ప్రభుత్వ వైద్య కాలేజీలో ర్యాగింగ్

Webdunia
బుధవారం, 27 జులై 2022 (14:43 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ర్యాగింగ్ భూతం వెలుగు చూసింది. ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కాలేజీలో జూనియర్ విద్యార్థులను సీనియర్ వైద్య విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో వేధించారు. కొందరు ఎంబీబీఎస్ సీనియర్ విద్యార్థులు జూనియర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. పైగా, నోటికి వచ్చినట్టుగా దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు. 
 
ఈ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఉన్న ప్రభుత్వ వైద్య కాలేజలో ఈ ఘటన జరిగింది. ర్యాగింగ్ ఘటన తర్వాత జూనియర్లు యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దిండుతో, బ్యాచ్‌మేట్స్‌తో అసహజ శృంగారం చేయాలంటూ జూనియర్లను సీనియర్లు వేధించారు. 
 
ఈ ఫిర్యాదుపై తక్షణం స్పందించిన యూజీసీ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఈ ఘటనపై చర్య తీసుకోవాలని కోరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి జూనియర్ విద్యార్థులు వాంగ్మూలాన్ని తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments