దీపికా పదుకునేకు దావూద్ ఇబ్రహీంకు సంబంధముందా? చెప్పిందెవరంటే?

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (13:09 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలోని జేఎన్‌యూ వర్శిటీలో విద్యార్థులపై జరిగిన దాడిని బాలీవుడ్ నటి దీపికా పదుకునే ఖండించింది. ఇంకా జేఎన్‌యూ వర్శిటీలో విద్యార్థులను పరామర్శించింది. జేఎన్‌యూలోకి ధైర్యంగా వెళ్లి విద్యార్థులకు దీపికా మద్దతు తెలపడంపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
 
ఈ నేపథ్యంలో ఇప్పటికే నోటి దురుసు అంటూ ముద్ర వేసుకున్న బీజేపీ ఎంపీలు ఒకడుగు ముందుకేశారు. ఇంకా దావూద్ ఇబ్రహీంకు దీపికా పదుకునేకు సంబంధం వున్నట్లు బీజేపీ ఎంపీ రాజేష్ సిన్హా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జేఎన్‌యూ క్యాంపస్‌లోకి అంత ధైర్యంగా దీపికా వెళ్లడం వెనుక దావూద్ హస్తం వుందంటూ చెప్పారు. ప్రస్తుతం రాజేష్ సిన్హా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
మరోవైపు జేఎన్‌యూలో కొందరు దుండగులు ముసుగులు ధరించి విద్యార్థులపై కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డిన సంగతి తెలిసిందే. దాడి ఘటనపై పెద్ద ఎత్తున నిరసలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దుండగుల దాడిలో గాయపడిని వారిని తమిళనాడు డీఎంకే ఎంపీ కనిమొళి పరామర్శించారు. ఇంకా జేఎన్‎‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌తో కనిమొళి మాట్లాడారు. దాడికి సంబంధించిన వివరాలు ఆయిషీ ఘోష్‌ను అడిగి తెలుసుకున్నారు. 
 
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలన్నారు. మంగవారం బాలీవుడ్ నటి దీపికా పదుకునే బాధితులు పరామర్శించారు. ఈ నేపథ్యంలో దీపిక పదుకొనేను పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

దీనిపై కనిమొని స్పందించారు. దీపికా పదుకొనేను నెటిజన్లు ట్రోలింగ్ చేయడం తప్పుబట్టారు. దీపికా సినిమాలు చూడొద్దని నెటిజన్లు పిలుపునివ్వడం సరైంది కాదన్నారు. ఇప్పటి వరకు తాను హిందీ సినిమాలు చూడలేదని, దీపిక మద్దతుగా ఆమె నటించిన హిందీ చిత్రం ఛపాక్ చూస్తానని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AA22: స్పైడర్-మ్యాన్, అవెంజర్స్ తరహాలో AA22 చిత్రం ఉండబోతుందా ?

K. Raghavendra Rao: మహిళలకు డైమండ్ డెకాయిట్ చిత్రం ఉచితం

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫుల్-లెంగ్త్ ఎంటర్టైనర్ : ప్రొడ్యూసర్ శివప్రసాద్

VV Vinayak: వివేక్ మిశ్రా, శృతిక జంటగా అహోం.ప్రారంభం

AA22 x A6 ప్రీ లుక్ పోస్టర్‌.- అంచనాలు రెట్టింపు చేసిన టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

తర్వాతి కథనం
Show comments