Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హంతకులు చచ్చేంత వరకు జైల్లో ఉండాల్సిందే...

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని హత్య చేసిన నిషేధిత ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థకు చెందిన హంతకులను వదిలిపెట్టే విషయంలో ఏమాత్రం దయాదాక్షిణ్యాలు చూపే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు దేశ అత్య

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (16:35 IST)
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని హత్య చేసిన నిషేధిత ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థకు చెందిన హంతకులను వదిలిపెట్టే విషయంలో ఏమాత్రం దయాదాక్షిణ్యాలు చూపే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఓ అఫిడవిట్ సమర్పించింది.
 
ఎల్టీటీఈకి చెందిన ఓ మహిళ మానవబాంబుగా మారి.. 1991, మే 21న రాజీవ్ గాంధీని హతమార్చిన విషయం తెల్సిందే. ఈ కేసులో దోషులు గత 27 ఏళ్లుగా జైలు శిక్షలను అనుభవిస్తున్నారు. ఈ ఏడుగురు ముద్దాయిలను విడుదల చేయాలని తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. 
 
అయితే, వీరిని విడుదల చేసే ప్రసక్తే లేదని కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు క్లారిటీ ఇచ్చింది. వాళ్లను విడిచిపెడితే దేశంతోపాటు ప్రపంచానికి కూడా తప్పుడు సందేశం ఇచ్చినట్లు అవుతుందని కేంద్రం అభిప్రాయపడింది. 
 
రాజీవ్ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిని.. విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. సర్కార్ నిర్ణయాన్ని సీబీఐ వ్యతిరేకించింది. రాష్ట్రపతి కూడా దోషుల విడుదలను నిరాకరించారు. దోషులపై ఏమాత్రం జాలి చూపాల్సిన అవసరం లేదని హోంశాఖ స్పష్టంచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments